ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు అరెస్టు వారెంటు జారీ అయ్యింది. అసత్య వార్తలు ప్రచురించినందుకు జగ్గయ్యపేట కోర్టు ఈ వారెంటును జారీ చేసింది. ఓ సివిల్ కేసులో అసత్య వార్తలు ప్రచురించినందుకు ల్యాండ్ ఓనర్ ముత్యాల సైదేశ్వరరావు ఎండి పై పరువునష్టం కేసు వేశారు.


అయితే ఆ కేసులో విచారణ జరిపినపుడు కోర్టుకు రాధాకృష్ణ హాజరు కాలేదు. ఎన్నిసార్లు వారెంటు ఇచ్చినా కోర్టు ఆదేశాలను లెక్క చేయలేదు. రాధాకృష్ణే కాకుండా ఎడిటర్ శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి మాధవి, స్ధానిక విలేకరులు కూడా కోర్టు విచారణకు హాజరుకాలేదు. దాంతో అందరికి అరెస్టు వారెంటు జారీ చేసింది. అయితే వారెంటు జారీ అయిన తర్వాత రాధాకృష్ణ బెయిల్ పిటీషన్ వేయగా కోర్టు తోసిపుచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: