కేశినేని నేని టీడీపీ తరుపున గెలిచినా ముగ్గురు ఎంపీల్లో తాను ఒకరు. విజవాడ నుంచి జగన్ సునామీని తట్టుకొని నిలబడిన వ్యక్తి కేశినేని నాని. అయితే నాని పార్టీని.. పార్టీలోని పలువురు నేతల్ని టార్గెట్ చేస్తూ.. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ మహా ఇబ్బందికరంగా మారటం తెలిసిందే. కేశినేని తీరు టీడీపీలో ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. ఆయన విషయం మీద మాట్లాడటానికి తమ్ముళ్లు భయపడిపోతున్నారట.


తెగించినోడు దేన్ని లెక్క చేయని తీరులో నాని తీరు ఉందని.. ఆయన ప్రస్తావన తెచ్చి పలుచన అయ్యే కన్నా.. ఈ ఎపిసోడ్ తో తమకేమాత్రం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోవటం మేలుగా చెబుతున్నారు. నాని వరుస ట్వీట్లు చూస్తుంటే.. తనకు తాను ఒక ఇమేజ్ ను సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నారన్న మాట వినిపిస్తోంది.ఇమేజ్ బిల్డింగ్ లో భాగంగా నేతలు కిందామీదా పడటం మామూలే అయినా.. ఇలా అడ్డ బ్యాటింగ్ తో ఇష్టం వచ్చినట్లుగా ఆడేస్తున్న ఆట అంతిమ లక్ష్యం ఏమిటన్నది ఒక ప్రశ్న .


అయితే.. నాని కారణంగా తాము నమ్ముకున్న పార్టీ నట్టేట మునిగిపోవటం ఒక ఎత్తు అయితే.. ఇంతకాలం తమకు మించినోళ్లు లేరన్నట్లుగా ఉండే సామాజిక వర్గానికి తలవంపులు తెచ్చేలా నాని వ్యవహరిస్తున్నారన్న కంప్లైంట్ తో నానికి చెందిన సామాజిక నేతలంతా కలిసి తాజాగా బెజవాడలో ఒక చోట జమైనట్లుగా తెలుస్తోంది. వారంతా కూర్చొని నాని కారణంగా తాము నమ్ముకున్న పార్టీకి జరిగిన నష్టం ఎంతన్న దానిపై చర్చించుకున్నట్లుగా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: