విశాఖపట్నంలో చర్చిలకు భద్రత కల్పిస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలిచ్చారు.ఐతే ఇది సరైన నిర్ణయం కాదన్నారు బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి. కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పించటం అనేది ఒక మతాన్నో,ఒక కులాన్నో కావాలని ప్రోత్సహించేలా వ్యవహరించడం సమాజంలో ఘర్షణ వాతావరణానికి కారణమవుతుందని వ్యాఖ్యానించారు.
రాజమండ్రిలో జరిగిన బీజేసీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన ఆమె,ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ప్రభుత్వం కూడా తమ తీరు మార్చుకోవాలన్నారు. కేంద్రం నుంచి వైకాపా ప్రభుత్వం కేవలం ప్యాకేజి మాత్రమే తెస్తుంది కానీ, హోదా సాధ్యం కాదన్నారు పురందేశ్వరి.
తెలంగాణాతో కలిసి గోదావరి జలాలను తరలించే విషయంపై అఖిలపక్షం నిర్వహించాకే సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు. టీడీపీ హయాంలో కులాలు, కార్పొరేషన్ల పేరుతో విభజన రాజకీయాలు చేశారని, ఇలాంటి విధానాలను ప్రజలు గమనిస్తున్నారని,వైసీపీ ఆ దిశగా వెల్లకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు.