అమరావతికి బడ్జెట్ కేటాయింపులు తక్కువగా జరిగియని టీడీపీ నానా హంగామా చేస్తుంది. మరావతికి తమ బడ్జెట్ లో ఐదువందల కోట్ల రూపాయలను కేటాయించారు బుగ్గన. రాబోయే ఏడాది కాలంలో ఈ నిధులను అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్టుగా ఆయన బడ్జెట్ లో పేర్కొన్నారు.


అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆక్షేపణ తెలుపుతూ ఉంది. అమరావతికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. బడ్జెట్ పై చర్చలో భాగంగా ఈ విషయాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దీనిపై మంత్రి స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి అభివృద్ధి కోసం ఖర్చుపెట్టిన నిధులను పేర్కొన్నారు.


చంద్రబాబు హయాంలో రెండు వందల డెబ్బై ఏడుకోట్ల రూపాయల నిధులను ఖర్చు పెట్టారని, తాము మాత్రం ఐదువందల కోట్ల రూపాయల కేటాయింపులను జరిపినట్టుగా బుగ్గన వివరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఖర్చుపెట్టిన దానితో పోలిస్తే తాము కేటాయించిన నిధులు ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరికైనా అర్థం అవుతుందన్నారు. అమరావతిపై చంద్రబాబు హయాంలో జరిగింది కేవలం ప్రచార ఆర్భాటమే అని తాము అలా చేయాలనుకోవడం లేదన్నట్టు బుగ్గన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: