దేశ రాజకీయాల్లో అస్థిరత్వం కలిగిన రాజకీయ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కర్ణాటకనే అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా అక్కడి ప్రజలు ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీని కట్టబెట్టిన దాఖలు లేవు. చాలా అరుదుగా అని చెప్పాలి . అందుకే ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు ఎన్ని రోజులు నిలబడతాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే మొన్న ఏర్పడిన కాంగ్రెస్ జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో ఇప్పుడు బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో కర్ణాటక స్పీకర్ నిజంగానే అందరికి జలక్ ఇచ్చారు. 


తాజాగా కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ కాంగ్రెస్ కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు జేడీఎస్ కు చెందిన ముగ్గురు ఒక స్వతంత్ర ఎమ్మెల్యేపై వేటు వేశారు. అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షకు వీరిని అనుమతించబోమని స్పీకర్ ప్రకటించారు.  కాగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి ఈ పరిణామం షాకింగ్ లా మారింది. ఆ 14 మంది అసంతృప్త కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీయే మభ్యపెట్టి అసమ్మతి రాజేసి వేరే రాష్ట్రాలకు తరలించిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వారు బీజేపీ కొలువు దీరడంతో వచ్చి మద్దతు పలుకుతామని ఆశించారు.


కానీ స్పీకర్ అనర్హతతో వారు విశ్వాస పరీక్షకు హాజరుకారు. మొత్తం సభ్యుల్లో మెజార్టీ కనుక తగ్గితే యడ్యూరప్ప సర్కారు కూడా పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ ద్వారా కాంగ్రెస్ విసిరిన ఈ పాచిక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. రెబల్స్ పై వేటుతో కన్నడ అసెంబ్లీలో బలనిరూపణ కష్టంగా మారింది. బీజేపీ కి మ్యాజిక్ మార్క్ దాటుతుందా లేదా.. కాంగ్రెస్ పాచిక వేసి  బీజేపీ ప్రభుత్వం నిలబడకుండా చేస్తుందా అన్న అనుమానాలు పెరిగిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: