ఏంటో .. చంద్రబాబు పరిస్థితి. ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నారు, చూస్తుంటే జాలేస్తుంది అని అంటున్నారు నెటిజన్లు. మరికొందరు నెటిజన్లు మాత్రం నీకు జాలి వేసింది అంటే త్వరలో నీ కొంప ముంగుతుందనే అర్ధం అని అంటున్నారు మరికొందరు. ఉన్నట్టుంది చంద్రబాబు గురించి ఇన్ని మాటలు ఎందుకు, ఇన్ని కామెంట్లు ఎందుకు అని అనుకుంటున్నారా ? కారణం ఉంది. మొన్నటికి మొన్న వైసీపీ నేతలు చంద్రబాబు చేతికి త్వరలో బేడీలు పడనున్నాయి అని అనగా, ఆంధ్ర బీజేపీ నేత సునీల్ దేవధర్ కూడా వైసీపీని చంద్రబాబు తప్పులు నిరూపించి జైలుకు పంపాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 


ఈ నేపథ్యంలోనే సినీ నటుడు, బీజేపీ నేత కృష్ణం రాజు తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు అయన ఆదివారం వచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు లక్షల మందికిపైనే పార్టీ సభ్యత్వాలు నమోదు అవుతాయని అన్నారు.


ఈ సందర్బంగానే చంద్రబాబు గురించి మాట్లాడుతూ పరోక్షంగా 'చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. పాము చచ్చిపోయాక ఇక కర్ర ఎందుకు' అంటూ వ్యంగ్యాస్త్రాన్ని వదిలారు. కేంద్రం తెచ్చినా అభివృద్ధి పధకాలు అన్ని తనవి అని చెప్పుకొని ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసినందుకు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. ఎన్నికలు రెండు వారాలలో వస్తయనంగా ప్రజల సింపతీ కోసం చంద్రబాబు తనను కేంద్రం జైల్లో పెడుతుందేమో అని చంద్రబాబు ఉహించుకొని అన్నారు. ఇప్పుడు అదే నిజం అవ్వనుంది. తప్పు చేసినవాడు జైలుకు వెళ్ళాక తప్పదు. ఇన్ని తప్పులు చేశాక చంద్రబాబు జైలుకు వెళ్ళాక తప్పదు అని ఆయన వ్యాఖ్యానించారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: