జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు మాత్రమే అయింది. ఆయన పాలన ఇంకా గాడిలో పడలేదు.  ఎవరైనా  కొత్త ఇంట్లో చేరినపుడు దానిని సరిదిద్దుకోవడానికి నెలల సమయం పట్టేస్తుంది. అలాంటిది పేరుకు పదమూడు జిల్లాలే అయినా భౌగోళికంగా చూస్తే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ను దారికి తేవడం అన్నది చాలా కష్టసాధ్యమైన విషయం. అది కూడా అతి తక్కువ సమయంలో కొత్త ప్రభుత్వం ముద్ర పడేలా చేసుకోవడం కూడా కష్టమే. కానీ  ఇక్కడ జగన్ కి శత్రువులు ఎక్కువ. ఇంటా బయటా కూడా ఉన్నారు. దాంతో జగన్ మీద విమర్శలు ఎక్కువైపోతున్నాయి.


తాను ఏ పార్టీకి చెందనని చెప్పుకుంటూ కామన్ మ్యాన్ గా ఒకాయన  తాజాగా జగన్ మీద తనదైన శైలిలో  కవితతో విరుచుకుపడడం ఆసక్తిని రేపుతోంది. జగన్ చెప్పట్టిన  పనులేవో ఆయనకు బాధ కలిగించాయట. ఆ మాటకు వస్తే టీడీపీ రోజూ చేస్తున్న  విమర్శలనే తన కవితగా మార్చి రాశాడీయన అనుకోవాలి. అసెంబ్లీ చుట్టూ అట‌వీ త‌మ్మలు పెంచార‌ని అమ‌రావ‌తిని అట‌కెక్కించార‌ని, ప్ర‌భుత్వాలే క‌క్ష్య సాధిస్తే  నీవు ఇక్క‌డికి వ‌చ్చేవాడివా బ‌తికి బ‌ట్ట‌క‌ట్టేవాడివా అంటూ ఆ వ్య‌క్తి ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించ లేదు కానీ ఆయన్నే టార్గెట్ చేసినట్టు మాత్రం అర్ధమవుతోంది.  ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  


నిజానికి ఇదంతా టీడీపీ వాళ్ళు ఆడిస్తున్నదిగా వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఎక్కడా అమరావతి ఆపలేదు. పోలవరం కూడా కేంద్రం చేపట్టాల్సిన జాతీయ ప్రాజెక్ట్. ఏపీలో నిధుల కొరత వుంది. అయినా బడ్జెట్లో జగన్ ఎన్నో పధకాలు కేటాయించి అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు. అమరావతి విషయలో కూడా తప్పక మంచి రాజధాని నిర్మిస్తామని వైసీపీ సర్కార్ చెబుతోంది.


అయినా ఇంతలో ఏమైపోయింది. జగన్ పాలన ఇపుడే కదా మొదలు పెట్టారని కూడా అన్న వారు లేకపోలేదు. ఇక అయిదేళ్ళు ఏపీని చంద్రబాబు పాలించారు. నాడు ఎన్నో అరాచకాలు జరిగితే ఈ కామన్ మ్యాన్ కవి గారి మనసు కరగలేదా అని వైసీపీ అభిమానులు నెట్టింట పెద్ద  యుధ్ధమే చేస్తున్నారు. ఏదో బురద జల్లాలని టీడీపీ ఇలాంటి వారి చేత కూడా చెప్పి చేయిస్తుందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జగన్ని బదనాం చేయడానికి కొత్త ఎత్తులు జిత్తులు ఎన్నో చేస్తున్నారని అంటున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: