వైసీపీ ప్రభుత్వం పై ఏపీ ప్రతి పక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయి లో మండిపడ్డారు. తమ హయాంలో వ్యవసాయ రంగం సాధించిన అభివృద్ధి అబద్ధమని వైసీపీ నేతలు మాట్లాడడం పై మండిపడ్డ అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన వాస్తవం దాగదు అంటూ చురకలంటించారు. ఈ మేరకు రాజ్య సభలో కేంద్ర వ్యవసాయ మంత్రి ఇటీవల విడుదల చేసిన నివేదికను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.




చంద్రబాబు రెండు వేల పదిహెడు పధ్ధెనిమిది సంవత్సరం లో ఏపీ సాధించిన వ్యవసాయ వృద్ధి రేటు అంతకుముందు ఏడాది కన్నా పదిహెడు పాయింట్ రెండు ఐదు శాతం ఎక్కువని చెప్పారు చంద్రబాబు అంతకుముందు రెండేళ్ల వివరాలను కూడా ట్విట్టర్ లో వెల్లడించిన ఆయన ఏడాది కి ఏడాది వృద్ధి ని పెంచు కుంటూ పోయామని స్పష్టం చేశారు.  ఏడుపు కళ్ల తో చూసే వైసిపి అభద్ధాలతో ప్రజల ను తప్పు దారి పట్టించా లని చూస్తోందని చంద్రబాబు విమర్శించారు అధికార పక్షం లో ఉండి కళ్లకు గంతలు కట్టు కుంటే ఎలా తెరిచి చూడనట్టు ఘాటుగా స్పందించారు.


 ఫైబర్ గ్రిడ్ పై విమర్శ లు వింటున్న ప్రజలకూ వైసిపిపై రోత పుడుతోందని అన్నారు లోకేశ్ టిడిపి ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రారంభిస్తే వైసిపి నేతల కడుపు మండుతోందని రెండోరోజే కేబుళ్లు కట్ చేశార ని ట్వీట్ చేశారు ఫైబర్ గ్రిడ్ ను రాష్ట్రపతి తో పాటు పలువురు సీఎంలు కూడా ప్రశంసించారని అయిదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ను మూడు వందల యాభై కోట్ల తో పూర్తి చేశామ ని అన్న అవినీతంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదని వాటి నిరూపించాలంటూ లోకేష్ సవాల్ విసిరారు.  రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరని ట్వీట్ లో సెటైర్ లు వేశారు .




మరింత సమాచారం తెలుసుకోండి: