ఆ కల ఎంతో దూరంలో లేదు అంటున్నారు పర్యావరణ శాస్త్ర వేత్త 'సుందరరామయ్య'. తనకు వచ్చిన ఆలోచనను తొమ్మిదేళ్లపాటు కష్ట పడి నిజం చేశారు. వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా నడిచే యంత్రం కనుగొన్నారు. మనం ఈ సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా మనం తెలుసుకుందాం. అది ఎలా అనేది ఒకసారి మనం ఈ టెక్నాలజీ లోకి వెళ్లి ప్రయత్నించి చూద్దాం. ఈ వెహికలు ఫోర్డ్ ఆల్ న్యూ ఫియస్టా ఫోర్డ్ అనే కంపెనీ తయారు చేసిన వెహికిల్. ఈ వెహికలు డీజల్ తోటి నడుస్తోంది. ఒక లీటర్ డీజిల్ కి పదిహేను కిలోమీటర్ల మైలేజీ మాత్రమే ఇస్తుంది ఈ వెహికిల్.
ఇపుడు ఈ వెహికల్ లో నేను ఏం చేశాను అంటే టెక్నాలజీ ని బూస్టప్ చేశాను. ఈ టెక్నాలజీలో ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటి అంటే ఒక లీటర్ వాటర్ ని తీసుకొని అది కొన్ని వందల లీటర్ల హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ అనేది డైరెక్టుగా మనం కంబషన్ చాంబర్ లోకి తీసుకువెళ్ళి క్రయోజనిక్ ఇంజన్ ను ఏ విధంగా అయితే రాకెట్ వేగవంతంగా దూసుకుపోతుందో సేమ్ ప్రాసెస్ లో మనం మెకానికల్ కంబషన్ ఇంజన్ లో ఈ హైడ్రోజన్ మనం ఫ్యూయల్ గా వాడుతున్నాం. ఇది ఫ్యూయల్ గా వాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే మేజర్ గా కోల్డ్ కంబషన్ అనేది జరుగుతుంది.
కోల్డ్ కంబషన్ జరగడం వల్ల ఎటువంటి భార ధాతువులు ఈ కంబషన్ జరిగిన తరువాత ఎటువంటి పొల్యూషన్ గ్యాసెస్ కూడా ఇక్కడ రిలీజ్ అవ్వని పరిస్థితి ఉంటుంది. ఈ బాక్స్ ఇంచుమించు పదిహేను లీటర్ల వాటర్ పడుతుంది. ఈ పదిహేను లీటర్ల వాటర్ ఒక లీటర్ వాటర్ ఈక్వల్ టు తర్టీ లీటర్ ఫ్యూయల్ కింద మనం కాంప్లికేషన్ చేయటం జరిగింది. అంటే ఇంచుమించు మనకి ఒక లీటరు ఈ వాటర్ ని మనం "మూడు వందల కిలోమీటర్ల" వరకు మనం ఈ టెక్నాలజీ ద్వారా మైలేజీని తీసుకోవచ్చు. ఇక వాటరు ఫీజులను ఉపయోగించక ముందు ఆ తర్వాత కారు ఇంజన్ లో జరిగే మార్పు ఎలా ఉంటుందో చూపించారు రామయ్య.