వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్ చేశారు. ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుకి, తెలుగు దేశం పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టించే వారు. అధికారం లేనప్పుడే చంద్రబాబుకి చుక్కలు చూపించిన విజయసాయి రెడ్డి, అధికారం వచ్చాకా ఆగుతారా ?


అధికారంలోకి వచ్చాక రోజుకో ప్రశ్నతో తెలుగు దేశం పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, భయపెడుతూ, వారు చేసిని అవినీతి పనులు అన్ని బయటకు తీస్తూ చుక్కలు చూపిస్తున్నారు. గత 5 ఏళ్ళల్లో ఏ నాయకుడు ఎన్ని తప్పులు చేశారనేది ట్విట్టర్ వేధికగా ప్రజల ముందు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రన్న, అతని పుత్రుడు జైలుకు వెళ్ళాక తప్పదు అంటూ ట్విట్ చేశారు.    


విజయ్ సాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కుట్రలో బాబు పార్ట్‌నర్‌ యనమల విలువల గురించి గురివిందలా మాట్లాడుతున్నారు. చిదంబరాన్ని అర్థరాత్రి కాళ్లు పట్టుకుని జగన్‌ గారిపైన కేసులు పెట్టించింది నీ బాసే కదా? రేపు మీ నాయకుడు, ఆయన కొడుకు ఏ జైల్లో ఉంటారో? ములాఖత్‌లో కలుద్దురు. సిద్ధంగా ఉండండి.' అంటూ ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: