వివాదం, సంచలనం వీటికి పెట్టింది పేరులాగా కనిపించే దర్శకుడు 'రాంగోపాల్ వర్మ'. అతను మాట్లాడిందే వేదం, అతను చెప్పిందే న్యూస్. అతను ట్విట్ చేస్తే ప్రతి న్యూస్ ఛానెల్ బ్రేకింగ్ న్యూస్ లా చూపిస్తుంది అలాంటి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎప్పుడు ఎలాంటి సంచలన వ్యాఖ్య చేస్తాడో ఎవరికీ తెలీదు. 


అలానే ఎవరు ఊహించని విధంగా నేడు కూడా ఒక సంచలన ట్విట్ చేసాడు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య చికిత్స నిమిత్తం గత నెల 30 వ తారీఖున అమెరికా పర్యటనకు వెళ్ళారు. ఆ సమయంలో చంద్రబాబు భార్యతో కలిసి అమెరికాలోని ఓ రెస్టారంట్ లో భోజనం చెయ్యడం, అమెరికా రోడ్లపై సామాన్య వ్యక్తిలా పాప్ కార్న్ తింటూ తిరిగే సమయంలోని ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చెక్కర్లు కొట్టాయి. 


దీంతో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ ఫోటోలను, వీడియోలను చూసి సంబరపోతున్నారు. ఈ తరహాలోనే వాళ్ళ ఆనందంపై నీళ్లు చల్లుతూ రాంగోపాల్ వర్మ సంచలన ట్విట్ చేశారు. 'రోజులో 20 గంటలు బిజీగా ఉండే మనిషి ఇప్పుడు పాప్ కార్న్ తింటూ రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు' అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ కి నెటిజన్లు స్పందిస్తూ 'అక్కడ ట్రంప్ ఉంటాడు సరిగ్గా చుడండి' అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొంతమంది నెటిజన్లు ట్విట్ చేస్తూ 'అతను గత 40 ఏళ్లలో ఎంతో కష్టపడ్డాడు, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు, అతనిని అనడం అపి మీ సినిమాలు మీరు చేసుకోండి' అంటూ ఘాటు సమాధానాలు ఇస్తున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: