బీజేపీ పార్టీ కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదాను, అధికారాలను రద్దు చేయడంతో, ఇక మిగిలింది .. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని బీజేపీ నేతలు చెబుతుండటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కాశ్మీర్ కు విశేష అధికారాలను కేంద్రం తొలిగించడంతో ఇప్పుడు కాశ్మీర్ మీద కేంద్రం పూర్తిగా పెత్తనం చెలాయించవచ్చు. ఇందులో ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే నాటకాలకు తెర  పడిందని చెప్పాలి. ఇప్పుడు కాశ్మీర్ అన్ని కేంద్ర ప్రాంతాల మాదిరి అది కూడా ఒకటి. భారత దేశంలో అమలయ్యే అన్ని చట్టాలు అక్కడ అమలవుతాయి. దీనితో కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిలువరించే అవకాశం భారత్ కు చిక్కింది. ఇన్ని రోజులు పాకిస్థాన్ ఆడిన నాటకాలు ఇక చెల్లవని మోడీ ప్రభుత్వం పాకిస్థాన్ ను హెచ్చరించినట్టయింది.


ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద పార్లమెంట్ లో కూడా అమిత్ షా చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసం ప్రాణాలైనా ఇస్తామని లోక్ సభలో అమిత్ షా భావోద్వేగంగా మాట్లాడినారు. దీనితో దేశంలో ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద ఒకటే డిస్కషన్ మొదలైంది. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం మాట్లాడుతూ .. పాకిస్థాన్ మర్యాదగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను అప్పగించాలని, దానికి అమెరికా ప్రెసిడెంట్ పాకిస్థాన్ కు చెప్పాలని చెప్పారు. 


అయితే పీఓకే ను ఎట్టి పరిస్థితిలో సాధిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే బీజేపీ నాయకులు అందరూ చెబుతున్నట్టు పీఓకే ను స్వంతం చేసుకోవటం సాధ్యమేనా ? అని సందేహాలు రాక మానదు.  కాశ్మీర్ అంటే 70 ఏళ్లుగా మన అధీనంలో ఉంది కాబట్టి కేంద్ర పరిధిలోకి తెచ్చుకోగలిగారు. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను దక్కించుకోవటం అంటే పూర్తి స్థాయి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరీ పూర్తి స్థాయి యుద్ధం వస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: