తెలుగుదేశం పార్టీ నేటికీ టీడీపీకి బలమైన కార్యకర్తలు ఉన్నారంటే.. అది కేవలం సీనియర్ ఎన్టీఆర్ ని ఇమేజ్ అనేది కాదనలేని సత్యం. అయితే ఎన్టీఆర్ వారుసిడిగా బాబుగోరును ఆదరించారు గాని, స్వయంగా ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణను మాత్రం ఎన్టీఆర్ కి వారసుడిగా తెలుగు తమ్ముళ్లు కూడా అంగీకరించలేదు. కారణం బాబుగోరు, హరికృష్ణల మధ్య సామర్ధ్యం. హరికృష్ణ కంటే బాబు సమర్ధుడు, తెలివిగలవాడు. అందుకే వెన్నుపోటు అనే ముద్ర ఉన్న బాబుగోరికి తెలుగు తమ్ముళ్లు పట్టం కట్టారు. కానీ టీడీపీకి వారుసిడిగా బాబుగోరు, ఆయన పుత్ర రత్నం లోకేష్ ను ప్రకటించేశారు. ఇది పసుపు సైన్యం అస్సలు నచ్చలేదట. టీడీపీ భవిష్యుత్తు నాయకుడిగా పప్పును తెలుగు తమ్ముళ్లు అంగీకరించలేని పరిస్థితి.
పైగా వైసీపీ నాయకులకు లోకేష్ అంటే ఒక కమెడియన్. ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు లోకేష్ ను పప్పు అని పిలుస్తూ హేళన చేస్తుంటారు. తాజాగా రోజా మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేశ్కు మతి భ్రమించిందని.. విమర్శించింది. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు, లోకేశ్లు యువతను మోసం చేశారని రోజా ఎప్పటిలాగే లోకేష్ ని తిడుతూ చెప్పుకొచ్చింది. అందులో కూడా కొంత వాస్తవం లేకపోలేదు. అందుకే అలాంటి లోకేష్ ని నమ్ముకుని రాజకీయం ఎలా చేసేది అని తెలుగు తమ్ముళ్లు బెంగ పెట్టుకున్నారు. కారణం మన పప్పుగోరు కంటే జూనియర్ ఎన్టీఆర్ సమర్ధుడు, తెలివిగలవాడు. దాంతో టీడీపీ ఆశాకిరణం జూనియర్ ఎన్టీఆరే అని పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకి ఓ బలమైన నమ్మకం పెరిగిపోతూ ఉంది. అందుకే ప్రస్తుత పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తోన్న ప్లెక్సీల్లో పప్పు ఫోటోకి బదులు తారక్ ఫోటోను ప్రధానంగా పెట్టుకుంటున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా లోకేష్ ట్వీట్స్ చేసుకుంటూ మిగిలిపోతే.. టీడీపీ పార్టీ నాయకుడిగా కాదు కదా.. సాధారణ నాయకుడిగా కూడా లోకేష్ ను ఎవ్వరూ ఒప్పుకోరు. అందుకే ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న పార్టీని ఒడ్డున పడేసేలా లోకేష్ మారాలి. లేకపోతే రోజా చెప్పిన మాటలే నిజమవుతాయి.