శ్రీశైలం ప్రాజెక్ట్ మన రాష్ట్రంలోని కృష్ణ నది పైన కట్టబడిన బహుళార్ధక జలాశయం. వర్షభావ పరిస్థితిలో రైతులకు ఈ జలాశయం ఎంతో ఆధారమని చెప్పాలి. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, తరువాతి కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. తరువాతి కాలంలో ఈ పేరును నీలం సంజీవ రెడ్డి సాగర్ గా అప్పటి ముఖ్య మంత్రి పేరు మీద గా నామకరణం చేయబడింది. 2009 అక్టోబరు 2 న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీశైలం యెక్క నాలుగు గేట్లు ఎత్తివేయడానికి .. ప్రభుత్వ ఆదేశాల మేరకు జలవనరుల అధికారాలు నీటి మట్టాన్ని తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 


రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి సుమారు 4 లక్షల పైగా క్యూసెక్కుల నీటి వరద వచ్చి చేరింది. అధికారులు ముందు జాగ్రత్తగా నాలుగు గేట్లు ఎత్తివేసి, సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి అధికారాలు ప్రయాణిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం రాష్ట్ర మంత్రి సమక్షంలో గేట్లను ఎత్తివేస్తారని సమాచారం ఉంది. సాధారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి 15 లక్షల క్యూసెక్కుల నీరు వస్తేనే దానిని వరదగా భావిస్తారు. 


అయితే ఇప్పుడు వచ్చిన సమస్యేమీ లేదని .. ఇప్పడు కేవలం నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రాజెక్టులో చేరిందని ఈ రోజు సాయంత్రం సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని .. ప్రతి గంటకు పరిస్థితిని గమనించి గేట్లను పెంచడం లేదా తగ్గించడం చేస్తామని జల వనరుల అధికారులు చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు లో 4 గేట్లు ఎత్తుతారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: