నగరి ఎమ్మెల్యే రోజాకి అనందం వచ్చినా ఆపుకోలేదు.. బాధ వచ్చినా ఓర్చుకోలేదు. ఎవర్నైనా ఎన్ని మాటలైనా అనగలదు.  ఏ రేంజ్ పదాలనైనా వాడగలదు. అయితే  జగన్ పై మాత్రం ఓ రేంజ్ ప్రేమను కురిపిస్తోంది.  మైక్ ముందు ఉందంటే చాలు, బాబును తిట్టడం,  లోకేష్ బాబును  హేళన చెయ్యటం.. జగన్ పై  ప్రశంసల జల్లు కురిపించటం.. గత కొన్నేళ్లుగా రోజా చేస్తోన్న పని ఇదేలెండి.  ఆ మాటకి వస్తే..   ఏపీలో కొత్తగా అధికారాన్ని చేపట్టినటువంటి  జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంతా అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు.  అయితే రోజా మాత్రం  వైసీపీ  పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ..  పేదల కోసం గొప్ప పథకాలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి సీఎం జగనేనని రోజా  చెప్పుకొచ్చింది. 


సంచలనమైన నిర్ణయాలు తీసుకోవాలంటే నిజంగా గుండె దైర్యం చాలా గొప్పగా ఉండాలని.. అది ఒక్క జగన్ కే సాధ్యమైందని.. ప్రస్తుత  పథకాల  ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికి కూడా జగన్ లాభం చేశారని రోజా తెలిపారు.  అంతేకాకుండా మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కాలం చెల్లిన తరువాత, మళ్ళీ రాజన్న రాజ్యం ఎప్పుడు వస్తుందా అని ప్రజలందరు కూడా చాలా ఆశతో ఎదురు చూశారని  అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వచ్చాకే ఏపీలో రాజన్న రాజ్యం వచ్చిందని చెప్పారు.   అంతేకాకుండా ఇలా ఖచ్చితంగా మాట మీద నిలబడే నాయకులు చాలా అదురుగా ఉంటారని రోజా తెలిపారు. 


అయితే తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా రోజా జగన్ని ఎందుకు  ఇంతగా పొగుడుతుంది అని వైసీపీ నాయకులూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మంత్రి పదవిలో  ఉన్న వాళ్ళు జగన్ని కొంతవరకే  మెచ్చుకుంటున్నారు, కానీ రోజా మాత్రం రెచ్చిపోయి మరి జగన్ని ఆకాశానికి  ఎత్తేస్తోంది. మరి ఏం ఆశించి రోజా రెచ్చిపోతుందో రోజాకే తెలియాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: