వైసీపీ ఎంపీ, ట్విట్టర్ పిట్టా విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. తెలుగు దేశం పార్టీ నేతలపై విరుచుకు పడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబుపై, తెలుగు దేశం పార్టీ నేతలపై విమర్శలు చేసే విజయసాయి రెడ్డి, అధికారంలోకి వచ్చాకా ఒకొకరి చరిత్రను బయటకు తీస్తూ, వాళ్ళను విమర్శిస్తూ రోజు వార్తల్లో నిలుస్తున్నారు. 


40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూరలో కర్వేపాకు తీసేసినట్టు తీసేసే నాయకుడు ఎవరు అంటే విజయసాయి రెడ్డి పేరు ముందు ఉంటుంది. అలాంటి విజయసాయి రెడ్డికి చంద్రబాబులో, అతని పార్టీలో ఏవైనా తప్పులు కనిపించాయి అంటే ట్విట్టర్ వేధికగా ఆ తప్పులు అన్ని నెటిజన్ల ముందు పెట్టేస్తారు విజయసాయి రెడ్డి. 


ఈ నేపథ్యంలోనే తెలుగు దేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై లెక్క పెట్టలేనన్ని అవినీతి పనులు బయటకీ వచ్చాయి. అధికారంలో ఉన్నప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా కోడెల కుటుంబం ప్రజలను మోసం చేసిన కేసులు అన్ని ఒక్కసారిగా బయటకు వచ్చాయి. దీంతో చివరికి కోడెలను చూసి వారి పార్టీ నేతలు కూడా అసహించుకుంటున్నారు. 


ఏ తరహాలోనే విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ 'పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ కలిసి ఆ ‘కోడె’ల సంగతి చూడండి. ఐదేళ్లు ఆంబోతులా జనంపైకి వదిలారు. కోడెల గుంపు పొడిచి, తన్నని వారే లేరు. ఇకనైనా దొడ్లో కట్టేయండి. లేకపోతే తరిమేయండి. ఎలాగో నాలుగు రోజుల్లో గుదె కట్టి గుంజలకు కట్టేయక తప్పదు ప్రభుత్వానికి.' అంటూ ట్విట్ చేశారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: