టీడీపీ పార్టీలో ఎప్పుడు ఏ నేత జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆ పార్టీలో నేతలను కాపాడుకోవటం ..అధినేత చంద్రబాబుకు పెను సవాలుగా మారింది. ఇంకొక పక్క బీజేపీ ఎవరికీ ఎప్పుడు గాలం వేస్తుందో అర్ధం కాని పరిస్థితి. దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు అలెర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. అయితే టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి గంటా శ్రీనివాస్ .. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ డుమ్మా కొట్టడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఈ ఇద్దరు అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. కేశినేని నాని అయితే ట్విట్టర్లో పలు చోట్ల టీడీపీ పార్టీ మీదే విమర్శలు చేసిన పరిస్థితి. అయితే ఇక గంటా పరిస్థితి ఇతనిది అసంతృప్తి అని చెప్పలేము గాని, గంటాకు అధికారం లేకపోయే సరికే టీడీపీ పార్టీలో ఉండలేక పోతున్నారు.


గంటా శ్రీనివాస్ కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద విమర్శలతో రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడెందుకో గంటా మోగడం లేదు. అసెంబ్లీలో కూడా గంటా నోరు తెరిచి మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ ఎక్కడ తన మీద పగబట్టి కేసుల్లో ఇరికిస్తుందేమో నని గంటా భయపడుతున్నంటున్నారు. అందుకే ఎక్కడ సడి చప్పుడు లేకుండా తన పని తాను చూసుకుంటున్నాడు. 


అయితే గంటా .. ఎన్నికల ముందు జగన్ దగ్గరికి చేరి ఉంటే, ఇప్పుడు మంచి పదవిని పొందే వాడేమో ! మళ్ళీ అధికార పార్టీలో చక్రం తిప్పే వాడు. కానీ ఇప్పుడు ప్రతి పక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అధికారం లేనిదే గంటా కు నిద్ర పట్టదు కాబట్టి .. తాను బీజేపీలోకి చేరబోతున్నాడని, గంటా ఉత్తరాంధ్రలో బలమైన నేత కాబట్టి, పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో బీజేపీ గంటా మీద కన్నేసింది. పైగా టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి గంటా డుమ్మా కొట్టడంతో ఇప్పుడు మళ్ళీ గంటా మీద అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: