టీడీపీ పార్టీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో కూడా దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను అధినేత చంద్రబాబు పసిగట్టిన నేతలను కంట్రోల్ లో పెట్టలేకపోయారు. చివర్లో డబ్బులతో మ్యానేజ్ చేయొచ్చనుకొని ప్రజలను బాబుగారు చాలా తక్కువ అంచనా వేసినారు. అయితే బాబును ప్రజలు విశ్వసించలేదు. 


దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 40 ఏళ్ల యువకుడైన జగన్ ..  రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి 40 ఏళ్ల ఇండస్ట్రీని పాతాళకంలోకి తొక్కేశారు. చంద్రబాబు చివర్లో ఎన్నో  సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినా ప్రజలు వాటిని విశ్వసించలేదు. దీనితో బాబుకు మరో సారి ప్రతి పక్షంలో కూర్చోక తప్పలేదు. అయితే జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, జగన్ సాధించిన భారీ మెజారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే చంద్రబాబు భవిష్యత్ అంధకారంలోకి పోయినట్టేనని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. 


అయితే ఇవన్నీ పక్కనే పెడితే ఈ రోజు జెండా పండుగకు టీడీపీ కార్యాలయాల్లో పెద్దగా హడావిడి లేదు. టీడీపీ నేతలు ఎవరు కూడా కనీసం పార్టీ హెడ్ ఆఫీస్ అయిన విజయవాడ లో కూడా జెండాను ఎగురవేయలేని పరిస్థితి. దీనితో టీడీపీలో ఏం జరుగుతుందని సందేహాలు రాక మానదు. నిరుడు ఇదే రోజు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఘనంగా జెండా పండుగను జరుపుకున్నారు. అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ కూడా జరుపుకుంది. కానీ ఇప్పుడు టీడీపీ ప్రతి పక్షంలో ఉంది. కానీ టీడీపీ మాత్రం జెండా పండుగను అస్సలు పట్టించుకోవటం లేదు. తెలుగు తమ్ముళ్లు బయటికే రావటం మానేశారు. ఇక పండుగను ఏం జరుపుతారని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: