సీఎం వైఎస్ జగన్ అమెరికా షెడ్యూల్
- ఆగస్టు 16న ఉదయం 8.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ) సీఎం జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అదే రోజు భారత అమెరికా రాయబారితో సమావేశాం అవుతారు. అనంతరం ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. సాయంత్రం అమెరికాలోని భారత్ రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.
- ఆగస్టు 17ను మధ్యాహ్నం 2 గంటలకు(భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30 గంటలకు) డల్లాస్ చేరుకుంటారు.
- అదే రోజు సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 తెల్లవారుజాము 4.30గంటలు) డల్లాస్లో ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్)లో నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీని కలుసుకొని, వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
- ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీ లో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు.
- ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనులపై పర్యటించనున్నారు.
- ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగో లో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8.30గంటలకు ఏపీకి బయలుదేరుతారు.