చంద్రబాబునాయుడును కరకట్ట మీద నుండి ఎలాగైనా ఖాళీ చేయించాలన్న ఉద్దేశ్యంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీళ్ళు వదులుతోందా ? అలాగనే టిడిపి నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ విన్నతర్వాత టిడిపి నేతలు ఇంత నీచంగా కూడా ఆలోచించగలరా అని అనిపిస్తే అది మీ తప్పు కాదు. నివసిస్తున్నదే అక్రమ నిర్మాణంలో. ఖాళీ చేయమని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా దాన్నే పట్టుకుని రాజకీయం కోసం ఊగులాడుతున్నారు చంద్రబాబు.

 

సరే కోర్టులో విచారణ జరుగుతున్నదన్న కారణంతో అక్రమ నిర్మాణాలను కూల్చేయకుండా ప్రభుత్వం ఆగింది. తానుంటున్నది అక్రమనిర్మాణమని, కృష్ణానది పొంగితే ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయని చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా రాజకీయం చేయాలని, జగన్ ను గబ్బు పట్టించాలన్న ఏకైక ధ్యేయంతోనే చంద్రబాబు ఇంకా అక్కడే తిష్ట వేసుకుని రాజకీయాలాడుతున్నారు.

 

ఈ నేపధ్యంలోనే ఉత్తరాధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు కూడా నీటితో కళకళ లాడుతున్నాయి. కృష్ణా, గోదావరి నదులు పొంగి పొరులుతున్నాయి. ఈ విషయాలు ప్రత్యేకించి ఎవరూ ఎవరికీ చెప్పక్కర్లేదు. మీడియాను ఫాలో అయ్యే వారికి అందరికీ తెలిస్తోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు ముణిగిపోయాయి. ఇందులో భాగంగానే పులిచింతల ప్రాజెక్టు నిండిపోవటంతో నీటిని వదిలేశారు. దాంతో అక్కడి నుండి నీరంతా  ప్రకాశం బ్యారేజిలోకి వచ్చేస్తోంది.

 

గేట్లు తెరవకపోతే బ్యారేజి పగిలిపోవటం ఖాయం కాబట్టి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేస్తున్నారు అధికారులు. దాంతో కృష్ణానదిలోకి నీరు ఉధృతంగా చేరుతోంది.  నదిని ఆక్రమించి కరకట్ట మీద నిర్మించిన  నిర్మాణాలు ముణిగిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. చంద్రబాబు ఉంటున్నది కూడా ఓ అక్రమ నిర్మాణంలోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. వాస్తవాలు ఇలావుంటే చంద్రబాబును ఎలాగైనా ఖాళీ చేయించాలన్న ప్లాన్ తోనే ప్రకాశం బ్యారేజి గేట్లను ఎత్తుతున్నారంటూ డొక్కా ఆరోపిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా మాట్లాడేవాళ్ళని ఎవరు మాత్రం ఏం చేయగలరు ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: