చంద్రబాబు మళ్ళీ భారీ ఓటమితో ప్రతి పక్షంలో కూర్చోవటంతో జగన్ ను విమర్శించడానికి ఏది దొరక్క పోయే సరికే ఏది పడితే అది మాట్లాడుతూ కామెడీగా తయారవుతున్నారు. జగన్ ను కార్నర్ చేయబోయి ప్రతి సారి తానే బుక్ అవ్వటం మనం చూస్తున్నాము. ట్విట్టర్లో ఎదో అబద్దాన్ని నిజం చేయాలని చూసి పలు సార్లు బుక్ అయ్యి .. నెటిజన్స్ నుంచి ఓ రేంజ్ లో కామెంట్స్ వచ్చేసరికే మళ్ళీ వాటిని డిలీట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు లోకేష్ అనుకుంటే ఇప్పుడు ఆ స్థానాన్ని బాబు గారు భర్తీ చేస్తున్నారు. కామెడీ ట్వీట్స్ తో హోరెత్తిస్తున్నారు. జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు.


ట్విట్టర్ లో ఒకరు మించి ఒకరు కామెడీని పండిస్తున్నారు. వీరు చేస్తున్న పనులు మైలేజీ తీసుకురావటం కాదు కదా జనాల్లో కమెడియన్స్  గా మార్చెస్తున్నాయి. ప్రజా వేదిక విషయంలో సింపతీని పొందాలని చూశారు కానీ అక్కడ కూడా సెల్ఫ్ గోల్ అయ్యింది. అక్రమ కట్టడం కూల్చడం కరెక్టే కదా అని మెజారిటీ జనాలు ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు డ్రోన్ల మీద రాజకీయం చేయాలనీ చూశారు కానీ అది కూడా బెడిసి కొట్టింది. 



టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రతి పక్ష హోదాకు పరిమితం అవ్వటంతో అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడతూ చంద్రబాబు అనిపించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏమన్నాడంటే  .. దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు ..  అని చెప్పారు. అయితే  అమరావతికే కాదు దేనికైనా లైటింగ్ వేస్తె అందంగా కనిపిస్తుంది. అంత మాత్రనా అది  ప్రపంచ స్థాయి రాజధాని అయిపోతుందా .. ? మరీ బాబు ఈ అర్ధం పర్ధం లేని ట్వీట్స్ ఎందుకో చేస్తున్నారో ఆయనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: