ప్రధాని షో కి వీక్షకుల భారీ మద్దతు
మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బేర్ గ్రిల్స్ తో కలిసి చేసిన మాన్ vs వైల్డ్ వీక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో భారీ విజయం సాధించింది. పర్యావరణాన్ని రక్షించడం, వన్యప్రాణులను సంరక్షించడం అనేటువంటి ఇతివృత్తం లో భాగంగా బేర్ గ్రిల్స్ మరియు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలిసి చేసిన ఈ సాహస యాత్ర ఉత్తరా ఖండ్లోని జిమ్ కార్బెట్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంలో జరిగింది. దీనిని ఆగస్టు 12వ తారీకు నాడు డిస్కవరీ ఛానల్ ప్రసారం చేయడం జరిగింది.
ఈ ప్రసారానికి తమ ఊహకందని మద్దతు లభించిందని డిస్కవరీ ఛానల్ మురిసిపోతోంది. దాదాపు 180 దేశాలు ప్రసారమైన ఈ ఈ కార్యక్రమానికి 36 లక్షల 90 వేలకు పైగా వీక్షకుల మద్దతు లభించిందని తెలుస్తోంది. ఈ ప్రసారం ఇంత విజయం సాధించడాని కి మన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్య కారకులు అని భావించవచ్చు.
ఈ కార్యక్రమ అ చిత్రీకరణ సమయంలో మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంతో ధైర్యంగా ఉన్నారని, నిత్యము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చిత్రీకరించే తమ యూనిట్ సభ్యులంతా కూడా భయపడుతున్న సమయంలో కూడా శ్రీ నరేంద్రమోడీ ఎటువంటి జంకు గొంకు లేక ధైర్యంగా చిత్రీకరణలో పాల్గొన్నారు అని ఈ కార్యక్రమ చిత్రీకరణ అనంతరం బేర్ గ్రిల్స్ చెప్పారు.