ఈకాలంలో ఆడపిల్లలను కనాలంటే భయమేస్తుందంటున్నారు కొత్తగా పెళ్లైన వాళ్లు.పసివాళ్ళు పడుచువాళ్ళు కాకముందే రాలిపోతున్నారంటూ వాపోతున్నారు.ఎందుకంటే నమ్మిన వారే నమ్మించి చిదిమేస్తున్నారు.పొద్దున లేచిన దగ్గరి నుండి ,వరుసకు బావ చేతిలో మోసం,మరోచోట అన్న వరుసైన వాడి దాష్టీకం.కామాంధుడైన కన్న తండ్రీ అంటు వార్తలు,ఈ మధ్య తాతల వయస్సున్న ముసలివాళ్లకు ఏం మాయరోగమొచ్చిందో వారు కూడ తామేం తక్కువ కాదని పాడు పనులు చేయడం మొదలెట్టారు,ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా,మందస మండలం లో ఏడేళ్ల చిన్నారిపై తాత వయసున్న కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు.బాధిత చిన్నారి తల్లి జీడి పరిశ్రమలో కార్మికు రాలు కాగా తండ్రి దర్జీగా పనిచేస్తున్నాడు.ఆ చిన్నారి ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.తమ పక్క ఇంట్లోనే ఉన్న గొరకల రుషి(60) అనే వృద్ధుడి కళ్లు ఎప్పటినుండో ఆ చిన్నారిపై పడ్డట్టున్నాయి,




వృద్ధుడిని ‘తాతా’ అని పిలిచే చిన్నారి ఈ నెల 16న పాఠశాల నుంచి వచ్చి ఇంటివద్ద ఎవరూ లేకపోవటంతో బయట ఆడుకుంటోంది.ఒక్కతే వుండటం గమనించిన ముసలాడు బిస్కెట్లు ఇస్తాను రా అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.అదేరోజు రాత్రి సమయంలో కడుపులో నొప్పి వస్తోందని,మూత్రం పోస్తుంటే నొప్పిగా ఉందని తల్లికి చిన్నారి చెప్పింది.దీంతో తల్లి ఆ చిన్నారిని వెంటనే పలాసలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరిశీలించి చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.తల్లిదండ్రులు చిన్నారిని ఏమి జరిగిందో చెప్పాలని ఆడగ్గా పక్కంటి రుషి తాతయ్య వల్లనే ఇలా జరిగిందని బయట పెట్టింది.పాప మాటలకు నిర్ఘాంతపోయిన వారు,ఈ విషయాన్ని గ్రామపెద్దలకు తెలియజేశారు.




ఆ గ్రామ పెద్దలు రూ.1.50 లక్షలు అందజేసేలా చూస్తామనిఎటువంటి కేసులు లేకుండా చేయాలని  బాలిక కుటుంబ సభ్యులకు సూచించారు.చేసిన నేరానికి శిక్ష పడాల్సిందేనని,మరోమారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని బాలిక వర్గానికి చెందిన వారు పట్టుబట్టారు.దీంతో బాధితురాలి తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సంఘటన స్దలాన్ని పరిశీలించారు.ఇదిలా ఉండగా,అఘాయిత్యానికి పాల్పడిన రుషిపై పోలీసులు కఠిన చర్యలు తీసు కోవాలని  గ్రామస్థులు కోరుతున్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజా సంఘాలు కూదా డిమాండ్‌ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: