జాతీయ పార్టీ అయినా బీజేపీ ఏపీలో బలపడటానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో ఒక్క సీటు గెలువకపోయిన కేంద్రంలో మాత్రం అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది.  కేంద్రం స్థాయిలో మోడీ హవాతో దేశం మొత్తం స్వీప్ చేసింది. దీనితో కేంద్రంలో బీజేపీకి తిరుగు లేకుండా పోయింది. అయితే అన్ని రాష్ట్రాల్లో చివరికి సౌత్ లోని కర్ణాటకలో కూడా బీజేపీ హవా స్పష్టంగా కనిపించినా ఏపీ లో మాత్రం లేదు. జగన్ .. 30 ఏళ్ల టీడీపీని మట్టికరిపించి 25 పార్లమెంట్ స్థానాల్లో ఏకంగా 22 స్థానాలు గెలుచుకొని సరికొత్త సునామీని సృష్టించారు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకొని ఔరా అనిపించింది. బీజేపీ ఇప్పుడు తెలంగాణతో ఏపీలో కూడా పాగా వేయాలని వ్యహ రచన చేస్తుంది. 


అయితే బీజేపీ ఆపరేషన్ లో భాగంగా టీడీపీ ఆర్ధిక స్థంబాలు అయినా నలుగురు రాజ్య సభ సభ్యులు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఈ నలుగురు బాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు. అలాగే రాష్టంలో టీడీపీ నుంచి చోటా మోటా నాయకులను బీజేపీ లాగేసింది. దీనితో బీజేపీ .. టీడీపీ నుంచి వచ్చిన నేతల ద్వారా బలపడాలని భావిస్తుంది. నిజంగా ఇలా బలపడటం ఇది సాధ్యమా ఆంటే దానికి సమాధానం చెప్పలేము. కానీ బీజేపీ తన ఓటు షేర్ పెరుగుతుందని ఆశిస్తుంది. 


అయితే ఇప్పుడు బీజేపీ కన్ను రాయలసీమ మీద పడింది. రాయలసీమలో టీడీపీ పార్టీకి హేమా హేమీలు ఉన్నారు. ఒక పక్క అనంతపురంలో జేసి బ్రదర్స్ .. పరిటాల ఫ్యామిలీ .. కర్నూల్ లో భూమా ఫ్యామిలి .. ఇక కడపలో అది నారాయణ రెడ్డి. వీరందరి మీద బీజేపీ బాగా ఫోకస్ పెట్టింది. కానీ ఒక్క అది నారాయణ రెడ్డి తప్ప మిగిలిన వారి నుంచి పెద్దగా స్పందన రాలేదు. అది నారాయణ రెడ్డి .. బీజేపీ వర్కింగ్ ప్రెసిండెంట్ నడ్డాతో భేటీ అవ్వటం ఇప్పుడు సంచలనం రేపుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు అది నారాయణ రెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. దీనిథి అది నారాయణ రెడ్డి .. జగన్ తో పాటు బాబుకు కూడా వెన్నుపోటు పొడిచినట్టే !

మరింత సమాచారం తెలుసుకోండి: