హైదరాబాద్లో అత్యంత జుగుప్సాకర రీతిలో హత్య జరిగింది. మియాపూర్లో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఆటో డ్రైవర్ను దారుణంగా హత్య చేశారు. తల ఒక చోట...శరీరం మరోచోట పడవేశారు. డెడ్ బాడీ మియపూర్లో..తల బొల్లారం ప్రాంతంలో లభ్యమైంది. మీయాపుర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురి క్షేత్రం దగ్గర జరిగిన ఈ దారుణ ఘటనలో హతుడిని 24 ఏళ్ల ఆటో డ్రైవర్ ప్రవీణ్ అని గుర్తించారు.
వ్యక్తి దారుణ హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు మొండెం, తలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆటో డ్రైవర్ ప్రవీణ్కు ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి తగదాలు, ఆటో నడిపే సమయంలో వివాదాలు వంటి కోణంలో కూడా అధ్యయనం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకొని పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలాఉండగా, ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో హత్యలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.అక్రమ సంబంధాలు, ఆస్తుల గొడవలు, కుటుంబ కలహాలు, డబ్బుల పంపకాల్లో తేడాలు, పలు రకాలైన పగలు...కారణాలు ఏవైనా దారుణంగా పలువురు వ్యక్తులు కన్నుమూస్తున్న ఉదంతం సంచలనంగా మారుతోంది. గత వారం సికింద్రాబాద్ మౌలాలీలో ఓ తనయుడు తన తండ్రిని దారుణంగా నరికి చంపడమే కాకుండా మూడు బకెట్లలో ఆయన అవయవాలను దాచిపెట్టడం సంచలనంగా మారింది. రైల్వే రిటైర్డ్ ఉద్యోగి అయిన మృతుడి తాగుడు అలవాటు, పెన్షన్ డబ్బుల కోసమే ఇలా చేశారని వార్తలు వచ్చాయి. కాగా, వివాహేతర సంబంధం కారణంగా గాజులరామరం బాలాజీ లేఔట్లో సునీల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యతో సునీల్ అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న కారణంగా సూర్యనారాయణ అనే వ్యక్తి కాపు కాసి, మరో ఇద్దరి సహాయంతో కర్రలతో దాడి చేసి సునీల్ను చంపేశాడు.