ఓ బ్రాహ్మణుడు అనారోగ్యంతో మృతి చెందాడు. యథా ప్రకారం కుటుంబ సభ్యులూ దహన సంస్కారాలు నిర్వహించారు. ఎవరైనా మృతి చెందితే ఆ ఇల్లంతా శుభ్రం చేయడం ఆచారం. అలాగే బ్రాహ్మణుడు కుటుంబ సభ్యులు కూడా ఆయన నివసించిన పాడుబడిన ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెట్టారు. ఇల్లంతా పరుచుకున్న బోసిపోయిన పాత దుస్తులు చిన్న చిన్న మూటలు తీసేస్తుంటే నమ్మలేని విషయం బయటపడింది. ఆ దుస్తులు మూటల్లో ఎక్కడ చూసినా డబ్బే. నోట్లు చిల్లర నాణేలు పెద్ద మొత్తంలో కనిపించాయి.


పనికిరానివని పారపోసిన మూటల్లో డబ్బులు దొరకడం చూసి కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం కలిగింది. ఆ డబ్బులను కుటుంబ సభ్యులు లెక్కించడం ప్రారంభించారు. చిల్లర నాణ్యాల నుంచి పది, ఇరవై, యాభై, వంద, అయిదు వందల నోట్ల వరకూ వాటిలో ఉన్నాయి. రెండ్రోజుల పాటు లెక్కిస్తే అయిదు లక్షల రూపాయలు వచ్చాయి. అయినా ఇంకా లెక్కించాల్సినవీ చాలా ఉండటంతో కౌంటింగ్ మిషన్ తెప్పించి మరీ లెక్కించారు. మొత్తంగా ఆ మూటల్లో పది లక్షల రూపాయలు డబ్బులు ఉన్నట్టు తేలింది. ఈ మొత్తం డబ్బు మృతి చెందిన బ్రాహ్మణుడు అప్పల వలి సుబ్రమణ్యంకు చెందింది. అంత డబ్బు దగ్గర ఉంచుకుని కూడా చివరి రోజుల్లో ఆయన దుర్భర జీవితం గడిపాడు. వలి సుబ్రమణ్యం పౌరోహిత్యం చేసేవాడు.


భార్య చనిపోవడంతో సుబ్రమణ్యం పదేళ్ళ నుంచి తూర్పు గోదావరి జిల్లా లోని తునిలో ఒక ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. పొట్టకూటి కోసం సుబ్రమణ్యం యాచకుడిగా కూడా మారాడు. అలా లభించిన రూపాయి రూపాయిని ప్లాస్టిక్ కవర్ లో పాత దుస్తుల్లో మూటకట్టి ఉంచుకున్నాడు. భారీ మొత్తంలో డబ్బులు ఉన్నప్పటికీ యాచకుడిగా చివరి రోజుల్లో సుబ్రమణ్యం దయనీయ జీవితం గడపడాన్ని తలుచుకొని కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. ఈ మొత్తాన్ని బ్రాహ్మణ సంఘానికి విరాళంగా ఇస్తామని అనకాపల్లిలో స్థిరపడిన సుబ్రమణ్య కుమారుడు చెబుతున్నాడు. భిక్షాటన వృత్తి చేసే వాళ్ల దగ్గర డబ్బులుండవు అన్నది అందరి అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: