గురజాలలో ఘోరం జరిగింది. ఈ నెల ఇరవై ఐదు న అదృశ్యమైన నాలుగేళ్ల అన్నపురెడ్డి సుభాష్ శవమయ్యాడు. అదృశ్యమైన ఆరు రోజులకు మృతదేహం లభ్యమైంది. సుభాష్ ను దుండగులు ముక్కులు ముక్కలుగా నరికి పడేశారు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపి తనిఖీలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా గురజాలలో జరిగిన ఈ ఘటన పై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇప్పటికే ఈ ఘటన పై కేసు నమోదు చేసి అక్కడ సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్ళను,అవయావాలను కూడా డిఎన్ఎ పరీక్షకు పంపించారు. బాలుడా కాదా నిర్ధారించుకునేందుకు కూడా డిఎన్ఎ టెస్ట్ కి పంపిచారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని వస్తువులను చూసి ఆ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాళ్ళ బాబువేనని గుర్తించారు. పోలీసులు కూడా చుట్టు పక్కల ప్రాంతం ఆ బాలుడి యెక్క టీ షర్ట్,నిక్కరూ లభించిన ప్రాంతం స్మశాన వాటిక కావటంతో కూడా ఆ చుట్టు పక్కల ముళ్ళ పొదలు చెట్లు అన్ని ప్రాంతాల్లో కూడా క్షున్నంగా గాలింపు చర్యలు చేపట్టి ఇంకెక్కడైన వేరే మృతదేహాం దొరుకుతుందా లేదా అని కూడా వెతికారు.


అక్కడ స్మశాన వాటిక కాబట్టి మృతదేహం ఆ బాలుడుదేనని నిర్ధారించుకోవాలని కూడా పోలీసులు ఆ చుట్టు పక్కల అంతా కూడా క్షుణ్ణంగా గాలించినప్పటికీ కూడా ఎలాంటి అవయవాలు కానీ ఎలాంటి ఆనవాలు కానీ లభించకపోవటం జరిగింది. తల్లిదండ్రులు బిడ్డను కావాలనే ఎవరో ఇలా హత్య చేసి ఉంటారని లబో దిబో మంటున్నారు. ఆ బాలుడి యొక్క తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావటంతో ఫైనాన్స్ వ్యాపారానికి సంబంధించి ఏమైనా గొడవలు జరిగి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే కోణం లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: