కోడెల శివప్రసాద్ మీద పలు కేసులు నమోదు అయిన సంగతీ తెలిసిందే. కోడెల ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ వేసిన సంగతీ తెలిసిందే. అయితే కోర్ట్ .. కోడెలకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్ట్ బెయిల్ ను మంజూరు చేసింది. అయితే కోడెల ఫ్యామిలీ పై వివిధ పోలీస్ స్టేషన్ లలో ఐదు కేసులు నమోదు అయ్యాయి. అయితే కోడెల చెబుతూ నా మీద రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని చెప్పారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది మాట్లాడుతూ 5 ఏళ్ళు ఫర్నిచర్ ను వాడుకొని ఇప్పుడు డబ్బులు కడతామని చెప్పడం చట్ట విరుద్దమని, ప్రభుత్వ ప్రొపెర్టీని స్వంత అవసరాల కోసం వాడుకోవటం చట్ట వ్యతిరేకం అని ప్రభుత్వ న్యాయవాది చెప్పుకొచ్చారు.


అయితే మరి కొన్ని కేసుల్లో కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది. అయితే టీడీపీ అధికారంలో మళ్ళీ వచ్చి ఉంటే కోడెల మళ్ళీ స్పీకర్ స్థానంలో చేతివాటం ఇంకా ఎక్కువయ్యేది. అసీంబ్లీ కోసం తెచ్చిన ప్రభుత్వ ఆస్తిని కోడెల శివప్రసాద్ తన స్వంత ప్రయోజనాల కోసం వాడుతున్నారని అధికారులు నిర్ధారణకు రావటంతో పోలీసులు కోడెల అతని కుమారుడి మీద కేసు కూడా నమోదు చేసారు. మాజీ స్పీకర్ అయ్యి ఉండి ఒక దొంగతనం కింద కేసు బుక్ అయ్యిందంటే కోడెల గురించి జనాలు నోరెళ్లబెడుతున్నారు.


అయితే గతంలో కోడెల చేసిన అరాచకానికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది.  ఒక ప్రజా ప్రతి నిధి అయి ఉండి అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నిచర్ ను కూడా దొంగిలించే స్థాయికి కోడెల దిగజారిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. టీడీపీలో ఇంకెన్ని ఘోరాలు జరిగివుంటాయో ! అయితే ఇన్ని జరుగుతున్న టీడీపీ పార్టీ నుంచి సపోర్ట్ రావటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: