వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిపక్షాన్ని విమర్శించడమే పనిగా భావించే విజయసాయి రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఏ తప్పులు ఉన్నాయో ఆ తప్పులు అన్ని వెతికి మరి బయటకి తీస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి దెయ్యం పట్టింది అని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు విజయసాయి రెడ్డి.  


ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు దెయ్యం పట్టిన వాడిలా మారిపోయారాని. భూములపై వందల కోట్లు పెట్టుబడి పెట్టిన తన బినామీలు, బంధువర్గం పరిస్థితి ఏమవుతుందనే బెంగ పట్టుకుంది. ప్రతిపక్ష నేత అయి ఉండీ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేయిస్తున్నారు'' అంటూ ట్విట్ చేస్తూ నారా లోకేష్ ని ట్యాగ్ చేశారు విజయసాయి రెడ్డి.  


ఈ ట్విట్ కు నెటిజన్లు స్పందిస్తూ బూతులు తిడుతున్నారు, నిజమే అతనికి రాజధాని మారుస్తారు అనే భయం చాల పట్టుకుంది.. తన ఆస్తి అంత వరదలా కొట్టుకు పోతుంది కదా ఇంకేం చెయ్యగలం అంటూ ట్విట్ చేశాడు ఓ నెటిజన్. మరికొందరు స్పందిస్తూ ''నిజమే చంద్రన్నకి దెయ్యం పట్టుకుంది దాన్ని మీరు వదిలిస్తే అది సెట్ అవుతుంది' అంటూ ట్విట్ చేస్తున్నారు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: