వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విధంగా ప్రతిపక్షాన్ని, ఆ నేతలని విమర్శిస్తూ తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. ఇదే పని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి చంద్రన్నను టార్గెట్ చేస్తూ ట్విట్లు చెయ్యడం విజయసాయి రెడ్డికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర అంత హింస రాజకీయమే అనే సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయసాయి రెడ్డి.   


ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారు. 600 మందిని హత్య చేశారు. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారు.'' అంటూ ట్విట్ చేస్తూ నారా లోకేష్ ని ట్యాగ్ చేశారు విజయసాయి రెడ్డి.  


అయితే ఈ వ్యాఖ్యలు బుద్ధా వెంకన్న స్పందిస్తూ 'చంద్రబాబు నాయుడు హింస రాజకీయం చేసుంటే మీరు ఉండే వారు కాదు అంటూ బెదిరింపు ట్విట్లు పెట్టాడు బుద్ధా వెంకన్న. ఈ ట్వీట్లకు స్పందించిన నెటిజన్లు బూతులు తిడుతున్నారు. ఓ నెటిజెన్ ట్విట్ చేస్తూ 'అవినీతి హత్యలలో ఆరి తేరిన చంద్రబాబుకు గ్రహణం పట్టింది. అయ్య కొడుకు యువరాజ్ పప్పు నాయుడుకు. రోజుకు కనీసం నాలుగు ఆరోపణలు వస్తున్న తరుణంలో వైసీపీ పార్టీపై ఆరోపణలు బురద చల్లుకుంటూ వాళ్ళు చేస్తున్నది అన్యాయం అని అందరికి తెలుసు' అంటూ ట్విట్ చేశాడు ఓ నెటిజెన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: