టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మీద వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ ఎవరు రెచ్చిపోని రేంజ్ లో గంటా మీద ఘాటు విమర్శలు చేశారు. అవంతి మాట్లాడుతూ అసలు నా దృష్టిలో గంటా మనిషే కాదని .. రాజకీయ వ్యభిచారి అని మీడియా ముందు చెప్పుకొచ్చారు. నెల్లూరు మెస్ లో టికెట్స్ అమ్ముకున్న నుంచి ప్రతిదీ నాకు తెలుసని గంటాను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. గంటా మోసగాడని .. అధికారం కోసం ఏ పనైనా చేయగలడని నిప్పులు కురిపించారు. అయితే  అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాస్ అప్పట్లో విశాఖ లో పెద్ద భూ కుంభకోణంలో గంటా హ్యాండ్ ఉన్నట్లు ఏకంగా టీడీపీ నేత ఆరోపించిన పరిస్థితి.


అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వాటిని మళ్ళీ తోడి గంటాను జైలుకు పంపించే కార్యక్రమం మొదలయినట్టు తెలుస్తుంది. గంటా శ్రీనివాస్ కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద విమర్శలతో రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడెందుకో గంటా మోగడం లేదు. అసెంబ్లీలో కూడా గంటా నోరు తెరిచి మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ ఎక్కడ తన మీద పగబట్టి కేసుల్లో ఇరికిస్తుందేమో నని గంటా భయపడుతున్నంటున్నారు. అందుకే ఎక్కడ సడి చప్పుడు లేకుండా తన పని తాను చూసుకుంటున్నాడు. 


గంటా శ్రీనివాస్ ప్రతి సారి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి మారేది .. ఆ పార్టీలో పదవులు అనుభవించడం గంటా శ్రీనివాస్ కు అలవాటు. అధికార పార్టీలో లేకపోతే గంటా రాజకీయాలు చేయలేనతంగా బలహీనంగా మారిపోతారు. గంటా టీడీపీ నుంచి ప్రజారాజ్యం లోకి చేరి తరువాత కాంగ్రెస్ పార్టీలోకి చేరి క్యాబినెట్ మంత్రి పదవిని కూడా అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయే లోపలా .. వెంటనే గంటా 2014 లో టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకొని పదవులను అనుభవించారు. అయితే 2019 ఎన్నికల్లో పార్టీ మారకుండా టీడీపీ తరుపున పోటీ చేసినా గెలిచారు. \

మరింత సమాచారం తెలుసుకోండి: