టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మీద అవంతి శ్రీనివాస్ రెచ్చిపోయిన సంగతీ తెలిసిందే. మీడియా ముందే గంటా మనిషే కాదని ఓ రేంజ్ లోరెచ్చిపోయారు. అవంతి మాట్లాడుతూ అసలు నా దృష్టిలో గంటా మనిషే కాదని .. రాజకీయ వ్యభిచారి అని మీడియా ముందు చెప్పుకొచ్చారు. నెల్లూరు మెస్ లో టికెట్స్ అమ్ముకున్న నుంచి ప్రతిదీ నాకు తెలుసని గంటాను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. గంటా మోసగాడని .. అధికారం కోసం ఏ పనైనా చేయగలడని నిప్పులు కురిపించారు. అయితే అవంతి ఇలా రెచ్చిపోవడానికి కారణం .. టీడీపీలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన గంటా .. అవంతికి అంతగా ప్రాధాన్యత లేకుండా వెనుక తతంగం నడిపించాడని తెలుస్తుంది.


అందుకే అవంతి బయిటకి వచ్చి వైసీపీలో చేరడం .. ఏకంగా మంత్రి అయిపోవటం కూడా జరిగిపోయాయి.  అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాస్ అప్పట్లో విశాఖ లో పెద్ద భూ కుంభకోణంలో గంటా హ్యాండ్ ఉన్నట్లు ఏకంగా టీడీపీ నేత ఆరోపించిన పరిస్థితి. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వాటిని మళ్ళీ తోడి గంటాను జైలుకు పంపించే కార్యక్రమం మొదలయినట్టు తెలుస్తుంది. గంటా శ్రీనివాస్ కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు.


అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద విమర్శలతో రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడెందుకో గంటా మోగడం లేదు. అసెంబ్లీలో కూడా గంటా నోరు తెరిచి మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ ఎక్కడ తన మీద పగబట్టి కేసుల్లో ఇరికిస్తుందేమో నని గంటా భయపడుతున్నంటున్నారు. అందుకే ఎక్కడ సడి చప్పుడు లేకుండా తన పని తాను చూసుకుంటున్నాడు. గంటా శ్రీనివాస్ ప్రతి సారి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి మారేది .. ఆ పార్టీలో పదవులు అనుభవించడం గంటా శ్రీనివాస్ కు అలవాటు. అధికార పార్టీలో లేకపోతే గంటా రాజకీయాలు చేయలేనతంగా బలహీనంగా మారిపోతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: