వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతి రోజు ఓ ట్విట్ పెట్టి ప్రతిపక్షానికి ట్విట్ తో నే చుక్కలు చూపించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికలు చంద్రబాబు నాయుడు ఇచ్చే వార్నింగ్'లు ఒకటేలా ఉంటాయి అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 


 విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు నాయుడు వార్నింగులు ఒకేలా ఉంటున్నాయి. మూడు నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ ఖాళీ చేయాలని గగ్గోలు పెడుతున్నాడు చంద్రబాబు.'' అంటూ ట్విట్ చేశారు సాయి గారు.  


ఈ ట్విట్ కి స్పందిస్తున్న నెటిజన్లు చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. '''ఏంటి బాబు .. 10 ఏళ్ళు కంటికి నిద్ర లేకుండా, చెప్పులు అరిగేలా ప్రతి ఇంటికి తిరిగి మీకు కష్టాలు లేకుండా చేస్తా అని హామీ ఇచ్చిన నాయకుడిని కుర్చీ దిగామని ఎలా చెప్తావు చంద్రబాబు.'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కొంతమంది నెటిజన్లు. 


మరి కొందరు స్పందిస్తూ చంద్రబాబు నాయుడుపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఓ నెటిజన్ ట్విట్ చేస్తూ ''మీరూ ఊరుకోండి సారు!! ఎక్కువ మాట్లాడితే చంద్రబాబు నాయుడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి కూడ అతనే రాజకీయం నేర్పాను అంటాడు... అది కుదరకపోతే ఇమ్రాన్ ఖాన్ కి క్రికెట్ కూడా నేనే నేర్పాను అంటారు''అంటూ ట్విట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: