అమెరికా లోని ఐదు రాష్ట్రాల గవర్నర్లు - న్యూజెర్సీ, అర్కాన్సాస్, కొలరాడో, డెలావేర్ మరియు ఇండియానా దేశంతో ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి రాబోయే రెండు నెలల్లో భారతదేశాన్ని సందర్శించనున్నారు. వారితో పాటు తమ రాష్ట్రాల నుండి అగ్ర వ్యాపారులను, వాణిజ్య ప్రతినిధులను తమ వెంట తీసుకు వస్తున్నారు.
అటు ట్రంప్ పరిపాలన, మోడీ ప్రభుత్వం ఇరు దేశాల సంబంధాన్ని మరింత పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ఐదుగురు అమెరికన్ గవర్నర్లు భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ ప్రణాలిక భాగాంగానే అమెరికా లోని ప్రస్తుత భారత రాయబారి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా ఇప్పటివరకు 11 అమెరికా రాష్ట్రాలకు వెళ్లారు.
రెండు దేశాలలో రాష్ట్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్న శ్రీంగ్లా, ఇది ఇరు దేశాల సంబంధం మెరుగు పరచడానికి చాలా ముఖ్యమైన చొరవ అని అన్నారు. "ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ప్రజల మధ్య స్నేహ పూర్వక వాతావరణానికి దేశాల మధ్య మంచి అభిప్రాయం ఉంది" అని శ్రీంగ్లా ఒక ఇంటర్వ్యూలో తెపారు.
న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ తన తొలి పర్యటనకు భారతదేశానికి బయలుదేరే కొద్ది రోజుల ముందు శ్రీంగ్లా మాట్లాడుతూ "రాబోయే రెండు నెలల్లో, యుఎస్ స్టేట్స్ నుండి ఐదుగురు గవర్నర్లు భారతదేశాన్ని సందర్శిస్తారని చెప్పడానికి నేను సంతోషంగా ఉన్నాను" అని అన్నారు. న్యూజెర్సీకి ఆయన మొదటి గవర్నర్, అది భారతీయ అమెరికన్ల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం .
అర్కాన్సాస్ గవర్నర్ ఆసా హచిన్సన్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 6 వరకు భారతదేశాన్ని సందర్శించనున్నారు. అర్కాన్సాస్ గవర్నర్ కు భారత పర్యటనకు ఇది మొదటిసారి.
ఈ నెల చివర్లో, ఇండియానా గవర్నర్ ఎరిక్ హోల్కాంబ్ తన రెండవ దేశ పర్యటనను భారత్, చైనా, జపాన్ మరియు దక్షిణ కొరియాతో సహా నాలుగు దేశాల పర్యటనలో భాగంగా వస్తారు. అక్టోబర్ ఆరంభంలో భారతదేశంలో, హోల్కాంబ్ భారతదేశంలో NBA మొదటి ఆటను వీక్షించనున్నారు.
ఒలోరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ ఈ వేసవిలో డెన్వర్లోని బిజినెస్ రౌండ్ టేబుల్ వద్ద ష్రింగ్లా సమక్షంలో వాణిజ్య ప్రతినిధి బృందంతో భారతదేశానికి వెళ్లాలని తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన ముంబై, బెంగళూరు, న్యూ ఢిల్లీలను సందర్శించనున్నారు.
డెలావేర్ గవర్నర్ జాన్ కార్నె కూడా కాలిఫోర్నియాకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ ఎలెని కౌనలకిస్ కలిసి త్వరలో భారతదేశానికి రానున్నారు. ఇలా ఐదు రాష్ట్రాల గవర్నర్లు భారత దేశం చూడడానికి వచ్చే రెండు నెలలలోవస్తున్నారు, దీని వల్ల ఇరఉ దేశాల మధ్య సంబంధాలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.