ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది బడా బడా టీడీపీ నేతలు సైలెంట్ అయిన పరిస్థితి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి జగన్ మీద రెచ్చిపోయే నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయి జగన్ కు సరెండర్ అయినట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ ముఖ్య నేతల్లో నారాయణ .. జగన్ కు సరెండర్ అయినట్టు తెలుస్తుంది. టీడీపీ మాజీ మంత్రి కూతురు ఇప్పుడు జగన్ దంపతులను కలిసి మాట్లాడటం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఒక పక్క తన తండ్రి టీడీపీలో ఉంటే కూతురు మాత్రం జగన్ ను కలిసి మాట్లాడటం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడు ఆమె నారాయణ కోట్లు విలువచేసే వ్యాపారాలను చూసుకుంటుంది.


ఇక నుంచి తాము రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండదలుచుకోలేదని చెప్పినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలు వెనుక అర్ధం వేరే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఎక్కడ నారాయణ ఆస్థుల మీద కేసుల పెట్టిస్తుందని ముందు జాగ్రత్తగా కలిసినట్టు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే జగన్  .. నారాయణ కూతురి విన్నపాన్ని మన్నిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.  అయితే నారాయణ .. టీడీపీ పార్టీకి ఆర్ధికంగా వెన్ను దన్నుగా నిలబడి పార్టీకి ఎన్నికల్లో డబ్బు కొరత లేకుండా చూశారు.


అయితే రాజధాని ప్రాంతంలో నారాయణకు సుమారు 2000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద  ఉన్నట్టు వైసీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఆ దిశగా సాక్ష్యాలను సేకరించే పనిలో ఉంది. నెక్స్ట్ టార్గెట్ నారాయణతో కలిపి మొత్తం ఐదుగురు టీడీపీ నేతలు కేసుల్లో బుక్ అవుతారని సమాచారం వస్తుంది.  ఇప్పటికే కోడెల శివ ప్రసాద్ మీద కేసులు బుక్ అయ్యాయి. అయితే నారాయణ తరువాత లిస్ట్ లో గంటా శ్రీనివాస్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: