అధికారంలో ఉన్న వాడిదే రాజ్యం. అతనే కింగ్ .. అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్క సారిగా సింహాసనం ఎక్కితే పరిస్థితులన్నీ తన కంట్రోల్ కి వస్తాయి. ఇప్పుడు జగన్ విషయంలో అదే జరుగుతుంది. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు గాని.. నేతలు గాని కనీసం లీడర్ గా గుర్తించని పరిస్థితి. ఇవన్నీ ప్రజలకు నచ్చలేదేమో జగన్ ను చక్రవర్తిని చేశారు. హేమా హేమీలు ఓటమి పాలై మీడియాకు మొహం కూడా చాటేసిన పరిస్థితి. అయితే కొన్ని రోజుల నుంచి గమనిస్తే టీడీపీ పెద్ద నాయకులూ .. కీలక నేతలు జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు .. కర్నూల్ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ జగన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.


అనంతపురం బాద్ షా అని చెప్పుకునే జేసి జగన్ మా వాడే అంటూ వెనకేసుకొని వస్తున్నారు. ఇదంతా చూస్తుంటే టీడీపీలో ఇక భవిష్యత్ లేదు వైసీపీ అండతో రాజకీయాల్లో ఉండాలని వీరందరూ భావిస్తునట్టున్నారు. అందుకే జగన్ మీద పొగడ్తలు కురిపిస్తూ తెగ ప్రేమను చూపిస్తున్నారు. అయితే ఇక అందరికీ కంటే ముందుగా చెప్పాల్సిన నేత నెల్లూరు నారాయణ. ఇతను చంద్రబాబుకు ఎంత చెబితే అంత .. టీడీపీలో కీలకంగా వ్యవహరించారు.


అయితే నారాయణ కూడా జగన్ కు సరెండర్ అయినట్టు తెలుస్తుంది. నారాయణ కూతురు ఇప్పటీకే జగన్ దంపతులను కలిసింది. ఒక పక్క తన తండ్రి టీడీపీలో ఉంటే కూతురు మాత్రం జగన్ ను కలిసి మాట్లాడటం ఇప్పుడు ఆసక్తిని రేపింది . ఇప్పుడు ఆమె నారాయణ కోట్లు విలువచేసే వ్యాపారాలను చూసుకుంటుంది. ఇక నుంచి తాము రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండదలుచుకోలేదని చెప్పినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలు వెనుక అర్ధం వేరే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఎక్కడ నారాయణ ఆస్థుల మీద కేసుల పెట్టిస్తుందని ముందు జాగ్రత్తగా కలిసినట్టు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే టీడీపీ నేతలందరూ జగన్ కు సాగిలపడినట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: