జనం వస్తే ఓట్లు వచ్చినట్టు కాదు.. జగన్ బచ్చ ఎం చెయ్యలేడు అని అన్నాడు.. కానీ ఇప్పుడు 'మా జగన్ అబ్బాయి చాల తెలివైనోడు' అంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన మోహన్ రెడ్డిని మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కాకాపడుతున్నాడు అని అంటున్నారు నెటిజన్లు. జగన్ అంటే విరుచుకు పడే జేసీ ఉన్నట్టుండి పొగుడుతున్నారు.  


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో 'జగన్ దగ్గరకు కొన్ని వేల సంఖ్యలో జనాలు వస్తున్నారు' అని జేసీ దివాకర్ రెడ్డిని ఒక యాంకర్ అడిగితే 'జనం వస్తే ఓట్లు వచ్చినట్టు కాదు' అంటూ మాట్లాడాడు మంత్రి పదవి చేతిలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ మా అబ్బాయి తెలివైనోడు, జగన్ 100 రోజుల పాలన అద్భుతం అంటూ సంచలన మాటలు మాట్లాడుతూ జగన్ ని కాకాపడుతున్నాడు అని అంటున్నారు నెటిజన్లు. 


తెలుగు దేశం పార్టీకి అధికారం పోయినప్పటి నుండి ఒకొక్కరు పార్టీ మారుతూ టీడీపీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సుజనా చౌదరి బీజేపీలో చేరి టీడీపీకి షాక్ ఇచ్చాడు. గంట శ్రీనివాస్ రావు వైసీపీలోకి వెళదామా అని అనుకుంటే దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. అయితే జేసీ దివాకర్ రెడ్డి పుత్రుల రాజకీయ భవిష్యేతు కోసం బీజేపీలోకి చేరుతారని ఆ మధ్య ప్రచారం జరిగిన అది ఇప్పటి వరుకు జరగలేదు. 


అయితే నిన్న జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే వైసీపీలో చేరేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారని అని అంటున్నారు నెటిజన్లు. జేసీ దివాకర్ రెడ్డి జగన్ ని ఎంత కాకాపట్టిన అతనికి పార్టీలోకి నో ఎంట్రీ అంటున్నారు నెటిజన్లు.   


మరింత సమాచారం తెలుసుకోండి: