ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లు చూపిన గ్రాఫిక్స్ గురించి సంచలన ట్విట్ చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి సూన్యం అని చెప్పిన మాటను పట్టుకొని సంచలన ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


ఇంతకి ఆ ట్విట్ లో ఏముంది అని అనుకుంటున్నారా ? విజయసాయి రెడ్డి సైరా పంచ్ అంటూ ''చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి సూన్యం అని అన్న మాటలను ఉద్దేశిస్తూ చంద్రబాబు మాట్లాడినట్టు చిత్రీకరించారు. ఐదేళ్లుగా గ్రాఫిక్స్ బిల్డింగ్స్ పచ్చ మీడియాలో చూపిస్తున్న కూడా.. అభివృద్ధి శున్యం అని అంటే మాకు భాధగా ఉండదా అండి' అని చంద్రబాబు అన్నట్టు చిత్రీకరించి ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ 'బాబు గారు చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధమే ఉండదు.! సింగపూర్ తలదన్నే రాజధాని నగరంకోసం అహిర్నిశలు కష్ట పడ్డాను అంటారు. బాబుగారు మాటలు వింటే నిజమేకదా అన్పిస్తుంది.! అలాగే ఆయన పచ్చ మీడియా ఊదర గొడుతుంది.! చివరకు అక్కడ ఏమి ఉండదు. చేసేది గోరంత.. చెప్పేది కొండంత.'' అంటూ ట్విట్ చేసి సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: