ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)  తమ ఖాతాదారులకు శుభవార్త  అందించింది. బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన కనీస బ్యాలెన్సులో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం  తీసుకుంది. ఇది వరకు విధించిన నిబంధనలను సడలిస్తూ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఈ నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమలు చేయాలని నిర్ణయింది. అయితే దీనిప్రకారం పట్టణ ప్రాంతాల్లోని స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలో కనీసం రూ.3 వేల కనీస బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండేది. అలాగే అర్బన్ ప్రాంతాల్లో అయితే వారివారి ఖాతాల్లో కనీసం రూ.2 వేలు ఉంచాల్సి ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల ఖాతాలో కనీసం వెయ్యి రూపాయలు నిల్వ ఉండటం తప్పనిసరి అని స్పస్టం చేసింది.

 

మరి నిబంధనలు పాటించకపోతే…

ఒకవేళ బ్యాంకు అధికారులు విధించిన నిబంధనలు పాటించకపోతే కూడా భారీగానే వడ్డన వేయనుంది. అయితే ఖాతాదారులు ఈ రూల్స్ పాటించకపోతే భారీగా జరిమానా విధించనున్నట్లు వివరించింది. అలాగే పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీస నిల్వ రూ.1500 మాత్రమే ఉంటే రూ.10, రూ.750కు తగ్గిపోతే రూ.12.75 జరిమానా  వడ్డించాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి జీఎస్టీ కూడా అదనమని వేయనున్నట్లు పేర్కొంది. ఇక సేవింగ్స్ ఖాతాలో నెలకు 3 సార్లు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఇది దాటితే అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. నాలుగోసారి కనీసం రూ.100 డిపాజిట్ చేసినా రూ.50 చార్జీ కింద సమర్పించుకోవాల్సిందే స్పష్టం చేసింది. దీనికి కూడా జీఎస్టీ అదనం. అలాగే నాన్ హోం బ్రాంచీల ద్వారా గరిష్టంగా రూ.2 లక్షలు మాత్రమే డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది.

 

నెలకు కనీసం రూ.25వేలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు నెలకు రెండు సార్లు ఉచితంగా బ్యాంకు నుంచి నగదును డ్రా చేసుకోవచ్చని, అదే రూ.25 వేలు -50వేల మధ్య బ్యాలెన్స్ ఉంచేవారికి 10 విత్ డ్రాలు ఉచితంగా చేసుకునే అవకాశం ఉంటుందని సూచించింది. ఇది రూ.50 వేలు దాటితే 15 సార్లు ఫ్రీగా నగదును డ్రా చేసుకోవచ్చని, నెలకు కనీస బ్యాలెన్స్ రూ.లక్ష ఉంచితే ఎన్నిసార్లయినా బ్యాంకు నగదు డ్రా చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు, నాన్ మెట్రో నగరాల్లో 12 సార్లు నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎం కార్డుదారులు ఎస్ బీఐ ఏటీఎం కేంద్రాల్లో ఐదుసార్లు ఉచితంగా నగదును తీసుకునే అవకశం కల్పించింది ఎస్బీఐ. ఒకవేళ ఏదైనా కారణంతో చెక్ బౌన్స్ అయితే జీఎస్టీతో కలుపుకుని రూ.168 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: