ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలకు మరో పేరు. రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ మంచికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు వైఎస్ జగన్. అతను తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు ఉపయోగ పడే విధంగా ఆయన నిర్ణయాలను తీసుకుంటున్నాడు. 


పుట్టిన పాప నుండి వృద్ధుడి వరుకు ప్రతిఒక్కరికి ఉపయోగ పడే సంక్షేమ పథకాలు తీసుకొని అమలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ నేపథ్యంలొనే వైఎస్ జగన్ కి యువత అంత అభిమానులు అయ్యారు. దాదాపు 9 సంవత్సరాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసి ప్రజా మధ్యలో తిరిగాడు. 


ఆ సమయంలో ఆయన చూపించే ప్రేమకు ఆయనకు ఎంతో మంది అభిమానులు అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఓ లేఖ రాశాడు. ఆ లేఖని చదివిన ప్రతిఒక్కరు సూపర్ జగన్ అన్న.. మీ రాజ్యంలో మార్పు మొదలైంది అంటూ పొగుడుతున్నారు.


ఆ లేఖలో ఆ అభిమాని ఇలా రాశాడు.. "జగన్ అన్న.. నువ్వు మా ప్రాణం.. నీ పాలనతో రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నావు. నాకు చదువు అంటే చాలా ఇష్టం.. కానీ ఆ కాలంలో మా ఊర్లో కేవలం 5వ తరగతి వరకు మాత్రమే బడి ఉంది. 6వ తరగతి చదవాలంటే పక్క ఊరికి వెళ్ళాలి. కానీ మా కాలంలో పక్క ఉరికి వెళ్లి చదువుకోవలన్న రోజు వెళ్ళడానికి డబ్బులు లేక చదువు మానేశాను. కానీ ఇప్పుడు అలా చదువు లేకుండా ఏ విద్యార్థి ఉండకూడదు అని ఆంధ్రలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలని 'అమ్మఒడి' అనే సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి చదువుని ప్రసాధిస్తున్నారు. మీరు ప్రవేశ పెట్టిబోయే ఈ సంక్షేమ పథకం వల్ల మా ఊరిలో ప్రతిఒక్కరు చదువుకుంటున్నారు.. మీరో గ్రేట్ జగన్ అన్న. అంటూ లేఖ రాశాడు ఓ అభిమాని. దీంతో ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: