తెలుగు రాష్ట్రాల్లో విస్తారించి ఉన్న నల్లమల్ల అడవుల్లో  యురేనియం లోహం ఉందని గుర్తించిన కేంద్రం ...ప్రణాళికలు రూపొందించి యురేనియం తవ్వకాలు జరిపేందుకు సిద్ధం  అవుతున్నది .ఈ నేపథ్యంలో  సేవ్ నల్లమల్ల అంటూ అందరు నిరసన గళం విప్పుతున్నారు .పలువురు రాజకీయ నాయకులూ, సినీ ప్రముఖులు , యువజన సంఘాల సభ్యులు నిరసన తేలియ  చేస్తూ సేవ్ నల్ల మల్ల ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు .రోజు రోజుకి సేవ్ నల్లమల్ల ఉద్యమానికి మద్దతు పెరుగుతుంది .కాగా నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచులు నల్లమల్ల ని కాపాడుకోవటానికి తమ ప్రాణాలను అర్పించటానికి సిద్ధంగా  ఉన్నట్లు ప్రకటించారు  ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నల్లమల్ల లో యురేనియం తవ్వకాలు జరపటానికి అనుమతించబోము అంటూ అసెంబ్లీ లో తీర్మానం చేసింది . 


ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు .అసెంబ్లీ  తీర్మానం నాలుక మీద గోక్కోవడానికి కూడా పనికిరాదని రేవంత్ రెడ్డిరేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్నితప్పుబట్టిన గువ్వల బాలరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్ర స్థాయిలో  ధ్వజమెత్తారు గువ్వల బాలరాజు . ఆంధ్రప్రదేశ్ లో చెల్లని రూపాయి అయినా పవన్ కళ్యాణ్ కి అడవి ఎక్కడ ఉందొ కూడా తెలియదని కానీ అలాంటి వ్యక్తి గొప్పలు మాట్లాడుతున్నారన్నారు .నల్లమల్ల పై ఏసీ  హోటల్‌లో  చర్చలు పెడితే వచ్చేదేం లేదని... పవన్ కళ్యాణ్ అనవసర ప్రసంగాలు చేయొద్దని సూచించారు.చట్ట సభలకు విరుద్ధంగా మాట్లాడవద్దని ఈ జోకర్, బ్రోకర్‌లకు తెలియదా అంటూ పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు గువ్వల బాలరాజు .


మరింత సమాచారం తెలుసుకోండి: