ఏమిటో చంద్రబాబునాయుడు ఏది మాట్లాడినా నిజాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే నిజాలు మాట్లాడితే చంద్రబాబు తలలు వెయ్యి ముక్కలైపోతుందనే శాపం ఉందని ప్రచారంలో ఉంది. చంద్రబాబు మాటలు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి లేండి. తాజాగా  ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చెప్పిన లెక్కలు వింటే అందరికీ చంద్రబాబు మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

తన హయాంలో పోలవరం పనులు 70 శాతం పూర్తయిపోయినట్లు చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయం అందిరకీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో జనాలు గనుక తప్పు నిర్ణయం తీసుకోకపోతే అంటే వైసిపిని గెలిపించకపోతే పోలవరం పూర్తి చేసేవాడినే అని డప్పు కొట్టుకుంటున్న విషయం వింటున్నదే.

 

అయితే అనీల్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం పనులు 40 శాతం మాత్రమే పూర్తియనట్లు చెప్పారు.  ఆ 40 శాతం పనుల్లో కూడా కుడి, ఎడమ కాల్వల తవ్వకం పనులు ఎక్కువ భాగం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే జరిగినట్లు స్పష్టంగా చెప్పారు. ఇక్కడే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. పోలవరం పనులను తానే వేగంగా చేయించినట్లు చంద్రబాబు ఇస్తున్నబిల్డప్ అంతా అబద్ధాలేనా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

జరగని రాష్ట్రాభివృద్దిని జరిగిపోయిందని చెప్పుకుంటూ చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నట్లు అనీల్ మండిపోయారు. చంద్రబాబు హయాంలో జరిగినదంతా కేవలం అవినీతి మాత్రమే అని కూడా స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడినట్లు అనీల్ ఆరోపించారు. చంద్రబాబు పాల్పడిన అవినీతి ఏ స్ధాయిలో ఉందో తాజాగా జరిగిన రివర్స్ టెండర్ లో బయటపడిందని కూడా చెప్పారు.

 

65వ ప్యాకేజీలో చంద్రబాబు ఎంత అవినీతికి పాల్పడ్డారో తెలిసిందని చెప్పిన అనీల్ తొందరలో మరిన్ని ప్యాకేజీల వ్యవహారం కూడా బయటపడుతుందని చెప్పటం గమనార్మం. రూ. 300 కోట్ల ప్యాకేజి వర్కులోనే ఇంత అవినీతి బయడపడితే వేల కోట్ల కాంట్రాక్టుల్లో ఇంకెంత అవినీతి జరిగుంటుందో బయటపడితే చంద్రబాబు పరిస్ధితేంటో ?


మరింత సమాచారం తెలుసుకోండి: