హిందు ముస్లిం భాయ్ భాయ్ అంటూ,అన్నిమతాలు,ఆత్మీయుల్లా,అన్నదమ్ములా జీవిస్తున్న భారతదేశమంటే పాకిస్తాన్ కు ఎందుకు అంతమంటో అర్ధంకాదు.మతగొడవల్లేవు, మారణహోమంలు అంతకంటే అసలే లేవు.పోని వారిమతాన్ని కించపరచే నీచబుద్ధి భారతదేశంలో జీవించే ఏ ఒక్క భారతీయుడికి తెలియదు.మరెందుకువారికి భరతమాతను చూస్తే అంత ద్వేషం.వారి ద్వేషానికి ఇక్కడ ఇప్పటికే ఎన్ని ప్రాణాలు పోయాయో లెక్కేలేదు.అయినా వారి పగ చల్లారక పచ్చగా వున్న ధరణిని మరో సారి రక్తసిక్తం చేయడానికి కుట్రలు పన్నుతున్నారట.ఇక పూర్తి వివరాలు తెలుసుకుంటే.



జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మసూద్ అజార్‌ను పాకిస్తాన్ ఇటీవలే విడుదల చేసింది.ఈ కోణంలోనే భారత్ లో ఉగ్రదాడులకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక పన్నాగాన్ని పన్నుతున్నట్లుగా నిఘా వర్గాలకు సమచారం అందింది. ముఖ్యంగా ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాషిలో,అమిత్ షా నియోజకవర్గం గాంధీనగర్లోనూ లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని కొద్దిరోజుల క్రితం నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.ఇప్పుడు వున్నది పండుగ సీజన్ కావడంతో రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్షాలు హెచ్చరికలు జారిచేసాయి.దేవాలయాలు, రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని,దేశవ్యాప్తంగా 30చోట్ల పేలుళ్లు జరిపేందుకు జైషే ఉగ్రవాదులు పథకరచన చేశారని వారు తెలుపుతున్నారు.



ప్రధానంగా లక్నో,కాన్పూర్‌,గాంధీనగర్‌ ఎయిర్‌ పోర్టులను పేల్చివేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారని అలర్ట్ చేసింది. అంతేకాదు..ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా,జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ను హిట్‌ లిస్ట్‌లో చేర్చామంటూ పౌర విమానయాన భద్రతా విభాగానికి జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ పేరుతో లేఖ అందింది.ఈ లేఖలో ఆర్టికల్‌ 370 రద్దుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడనున్నట్లు ఉగ్రసంస్థ పేర్కొంది.అలాగే ఎయిర్‌ బేస్‌ కేంద్రాలు ఉన్న శ్రీనగర్, అవంతిపొర జమ్మూ,పఠాన్‌ కోట్, హిందన్‌లపై దాడులు చేస్తామని హెచ్చరికలతో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని,అదీ ఎయిర్‌బేస్‌ కేంద్రంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.దీంతో దేశంలో ఉన్న ప్రధాన పట్టణాలు, సెక్యూరిటీ వింగ్స్ అన్నింటినీ అప్రమత్తం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: