మానవునిలో కామం,మోహం అనే రుగ్మతలు పీడిస్తున్న సమయంలో మంచితనం,మానవత్వం వికసించదు,అది గ్రామమా, నగరమా,మహా నగర సమీప ప్రాంతమా,అసలు విద్యావంతుడా,నిరక్షరాస్యుడా అనే ఆలోచన ఉండదు.అతడు ఎటువంటి తప్పును చేస్తున్నాడో,ఈ పరిస్దితి ఎటువైపు దారి తీస్తుందో కూడా తెలుసుకోలేడు.బుద్ధి వికసిస్తే మనిషిలా మారుతాడు.బుద్ధి వికటిస్తే మృగంలా మారి కౄరంగా ప్రవర్తిస్తాడు.నేటి సమాజంలో జరిగేది ఇదే.చక్కగా చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న చిన్నారులను చిదిమేస్తూ,భరించరాని బాధలు పెడుతున్నారు కొందరు కామాంధులు.ఆడపిల్లలంటే అంగడి బొమ్మల్లా మార్చుతున్నారు రోజురోజుకు.



ఎన్నని అత్యాచారాలు,హత్యలు ఆడవాళ్లను ప్రశాంతంగా బ్రతకనివ్వలేకుండా జరుగుతున్నాయి.ఏ చట్టం వారికి సురక్షితమైన రక్షణ కల్పించలేక పోతుంది.ఇప్పుడు ఇలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది.అభం శుభం తెలియని మైనర్ బాలికపై పక్కంట్లో ఉండే ఓ వ్యక్తి మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఆ కామాంధుడి అకృత్యాలను చిన్నారి మూడేళ్లపాటు మౌనంగా భరించింది.ఇక పూర్తి వివరాలు ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్లలో ఈ దారుణం చోటు చేసుకుంది.మైనర్ బాలికపై మూడేళ్లుగా నారగాని వీర వేంకటేష్ అనే వ్యక్తి భయపెడుతూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.దీంతో బాలిక గర్భం దాల్చింది.ఆ విషయం బయటపెట్టవద్దని బాలికను నిందితుడు మరోమారు బెదిరించాడు.అయితే మోసం తాలుకు నిజం ఎన్నిరోజులని దాగుతుంది..

ఓ రోజు బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఏం చేయాలో తెలియని తల్లిదండ్రులు బాలికని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ అమ్మాయిని పరీక్షించి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనిచెప్పారు.విషయం మొత్తం అమ్మాయి నుండి తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారు కేసు ఫైల్ చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు..ఇక ఇలాంటి సంఘటనలు సమాజంలో జరగకుండా తగుచర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు ఎన్నిఆందోళనలు చేసిన,పోలీసులు నిందితులను ఎంత కఠినంగా శిక్షించిన తప్పుచేసేవాడు చేస్తూనే వున్నాడు అవి ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే వున్నాయి. దీనిపై అధికారులు ఓ కఠిన నిబంధన ఏర్పరచి ఆ పనిచేయాలంటే భయంతో వణికిపోయేలా అమలుచేయాలని మహిళా సంఘాలు అంటున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: