ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాడేపల్లిలో నేడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంద్ర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు నాయుడుకి సవరాజికీయం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఎన్టీఆర్ నుండి కోడెల వరుకు ప్రతి ఒకరి శవంతో రాజకీయం చేశారని ఆమె వ్యాఖ్యానించారు.                  


కోడెల ఆత్మహత్యకు కారణం అతని కుటుంబసభ్యులు, చంద్రబాబు అని కానీ అది జగన్ ప్రభుత్వంపై వెయ్యాలని చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కాగా జగన్ అభివృద్ధి చూసి భరించలేక చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గత అయుదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని జగన్ వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలమందికి ఉద్యోగాలు ఇచ్చాడని ఆమె అన్నారు.                    


కాగా చంద్రబాబు ఇప్పుడు ఉంటున్న నివాసంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడానికి సిగ్గు లేదా చంద్రబాబు అంటూ ఆమె ప్రశ్నించారు. కాగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నీకు సొంతంగా ఇల్లు కట్టుకోడానికి స్తోమత లేకుంటే చెప్పు నేను కట్టిస్త అంటూ వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.                        

                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: