పెద్దమనుషులతో యవ్వారం జరుగాలంటే,కొన్ని పనులు కావాలంటే వాటికి లెక్కలుంటాయి.ఆ లెక్కలు డబ్బులతోనే కాదు కొన్ని అవసరాలతో,శారీరక సుఖాలతో ముడిపడి ఉంటుంది.పెద్దపెద్ద పనులు జరగాలంటే పడుపు వృత్తి చేయాలి,లేదా చేపించాలి.ఇలాంటి పనికి మాలిన పనులు చేసిన కొందరు చాలా డబ్బులు,పెద్దపెద్ద కాంట్రాక్ట్స్ కొట్టేసి ఆనక ఇప్పుడు చట్టానికి దొరికిపోయారు.అదే అతిపెద్ద సెక్స్ కుంభకోణం.మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ సెక్స్ కుంభకోణం కేసు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది.ఈ వ్యవహారంలో మాజీ గవర్నర్,మాజీ సీఎంతో సహా ఎనిమిదిమంది మాజీ మంత్రులు, 13 మంది ఐఏఎస్ అధికారులు,జర్నలిస్ట్‌లు ఉన్నట్టు సిట్ విచారణలో వెలుగుచూసిందిట.



కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు తమ పనులు చక్కబెట్టుకోడానికి బడాబాబులు,అధికారులకు దిగువ మధ్యతరగతికి చెందిన కాలేజీ అమ్మాయిల్ని ఎరగా వేసినట్టు తేలింది.ఆ అమ్మాయిలతో వారు ఏకంతంగా గడుపుతున్నప్పుడు రహస్యంగా వీడియోలు తీసి,వాటి సాయంతో బెదిరింపులకు పాల్పడినట్టు సిట్ విచారణలో నిందితులు తెలిపారట.మొత్తం 24 మంది కాలేజీ అమ్మాయిల్ని పావుగా వాడుకుని,వందలకోట్లు,ప్రభుత్వ కాంట్రాక్టలను దక్కించుకున్నారట.ఈ వ్యవహారంలో,ఉన్నతాధికారుల, మంత్రుల బలహీనతల్నే అవకాశంగా చేసుకుని డబ్బు,ప్రభుత్వ కాంట్రాక్టుల్ని కొల్లగొట్టిన కిలాడిలు వీరు..



అంతే కాకుండా వారు ఏకంతంగా ఉన్నప్పుడు చాటుగా వీడియో తీసి,అక్కడి సంభాషణలు,గుట్టుగా రికార్డుచేసి వాటిని చూపుతూ, బెదిరింపులకు పాల్పడిన అతిపెద్ద సెక్స్‌ దందా ఇది.ఇలాంటి వీడియో దృశ్యాలు, ఆడియో రికార్డింగ్‌లు, స్క్రీన్‌షాట్స్ అన్నీ కలిపి ఈ ముఠా దగ్గర దొరికిన ఫైల్స్‌ దాదాపు 4 వేలకు పైగానే ఉన్నాయి.ఇక ఇప్పటికే సూత్రధారులకు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలు,రెండు లాకర్లను పోలీసులు గుర్తించారట.మిగతావాటి కోసం ఆరా తీస్తున్నారట.ఇక ఈ కుంభకోణంలో బీజేపీ,కాంగ్రెస్‌ నేతలూ ఉన్నట్లు సమాచారమట.ఈ ముఠా దగ్గర 200 కు పైగా మొబైల్‌ ఫోన్‌ నెంబర్లతో కూడిన జాబితా లభించిందట.దేశం అభివృద్దిలోకి వెళ్లుతుందంటే ఏమో అనుకున్నాం కాని ఇంతలా అభివృద్ధి అవుతుందనుకోలేదని కొందరు గుసగుసలాడు కుంటున్నారట.ఈ ముచ్చట చదివిన వారు.



మరింత సమాచారం తెలుసుకోండి: