తూర్పుగోదావరిలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పినిపె విశ్వరూప్‌ ఇంటి ముందు యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఓ యువతీ మంత్రి  పినిపె విశ్వరూప్‌ ఇంటి ముందుకు వచ్చి అక్కడే పురుగుల మందు తాగడంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. అయితే ఆత్మహత్య యత్నానికి కుటుంబ కలహాలే కారణం అని తెలుస్తుంది.                         

                    

అయితే ఎన్నిసార్లు న్యాయం చెయ్యాలని మంత్రి పినిపె విశ్వరూప్‌కి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, తీవ్ర ఆవేదనకు గురైన యువతీ మంత్రి విశ్వరూప్‌ ఎదుటే పురుగుల మందు తాగినట్లు తెలిసింది. అయితే ఆమెను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి.. ఆ యువతీ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది అని తెలియడానికి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.                  

                    

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పినిపె విశ్వరూప్‌‌ స్థానం సంపాదించుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన గెలిచారు. టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుపై 25,654 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే యువతీ ఎందుకు మంత్రి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అనేది తెలియాల్సి ఉంది.                     

                                      

మరింత సమాచారం తెలుసుకోండి: