ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 15 నుంచి రైతుల కోసం ఈ పథకాన్ని  ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. అయితే శనివారం ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. అయితే ప్రధానితో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించిన సీఎం  జగన్ మోహన్ రెడ్డి... ఈ నెల 15న రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభోత్సవానికి నెల్లూరు రావాలంటూ ప్రధాని మోడీ కి జగన్ ఆహ్వానించినట్లు సమాచారం. 

 

 

 

 

 

 అయితే ప్రధాని మోడీ మాత్రం వైయస్సార్ రైతుభరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే అవకాశం లేదనే వాదన  బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఆరువేల రూపాయలు రైతులకు అందిస్తున్నప్పటికీ... జగన్ ప్రవేశపెట్టిన 12,500 రూపాయలు రైతు భరోసా పథకం లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు చెప్పుకోవడంతో ఆగ్రహించిన ఏపీ బీజేపీ నేతలు...ఈ విషయాన్నీ  బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాకి  తెలిపారట. అయితే వైస్సార్  రైతు భరోసా లో సగం సొమ్ము కేంద్రం  ఇస్తున్నప్పటికీ ప్రచారం మాత్రం మొత్తం వైసిపి ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడంతో ఆగ్రహించిన ఏపీ బిజెపి నేతలు ప్రారంభోత్సవానికి మోడీ రాకుండా పావులు కదిపారు. 

 

 

 

 

 అంతే కాకుండా జగన్ రైతుల కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేసి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగితే ఏపీలో బీజేపీకి రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏపీ బీజేపీ నేతలు నడ్డా కి  తెలిపారట. అయితే ఇదంతా జగన్ ఢిల్లీ పర్యటన వెళ్ళక ముందు నుంచే పావులు కదిపారట ఏపీ బిజెపి నేతలు. దీంతో వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ మోదీని ఆహ్వానించినప్పటికీ... మోడీ మాత్రం వచ్చే అవకాశం లేదని  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: