ఆడవాళ్లకు సమాజంలో రక్షణ కరువైంది. నెలలు నిండని పసికందుల నుండి పండు ముసలమ్మల వరకు దేశంలో కనీస భద్రత లేకుండా పోయింది. మనుషులుగా మానవత్వంతో ఉండాల్సింది పోయి కామంతో రాక్షసుల మారిపోతున్నారు. కామ రాక్షసుల మారి ఎంతటి ఘోరం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు రాక్షసుల మీద పడి పోతున్నారు. దేశంలో లైంగిక వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. మహిళలకు లైంగిక వేధింపులు విద్యాబుద్ధులు నేర్పుతున్న గురువుల నుంచి కూడా తప్పడం లేదు. విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతస్థానంలో విద్యార్థులను ఉంచాల్సిన ఉపాధ్యాయులు... తమ లైంగిక కోరిక తీర్చాలంటూ హింసిస్తున్నారు .
జ్ఞాన భాండాగారాలు అయినా విశ్వవిద్యాలయంలోనే మహిళలకు రక్షణ లేకపోతే... ఇక మహిళలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినిలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే... నీచ బుద్ది తో ఆలోచిస్తూ తమపై రాక్షసుల్లాగా పడితే...ఇక ఆడపిల్లలు చదువుకునేందుకు ఎలా ముందుకు వస్తారని అని ఆందోళన చెందుతున్నారు. తమను ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ నన్నయ యూనివర్సిటీ విద్యార్థులు రాసిన లేఖతో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాజమండ్రిలోని నన్నయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ కి హెడ్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర... స్పెషల్ క్లాస్ ల పేరిట ఎంఏ ఇంగ్లీష్ విద్యార్థులను... స్పెషల్ క్లాసులు అంటూ ఇంటికి రప్పించుకొని విద్యార్థినులపై... లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి. రోజురోజుకు పెరిగిపోతున్న లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థినులు చివరికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. తమకు ఎదురవుతున్న దారుణాలను వివరించి... సమస్యలు పరిష్కరించాలని కోరారు.