అరాంకో చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా మార్కెట్ను కుదిపేసింది. దీంతో దేశంలో పెట్రోల్ డీజీల్ ధరలు గత కొన్ని రోజులుగా పెరగుతూ, స్వల్పంగా తగ్గుతూనే ఉన్నాయి. ఇక తగ్గిన ధరలను ఓ సారి పరిశీలిస్తే ఈ రోజు అంటే శనివారం పెట్రోల్ 10 పైసలు, డీజిల్ ధర 15 పైసలు చొప్పున దిగొచ్చింది. దీంతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.77.97 ఉండగా. డీజిల్ ధర రూ.72.47 కు ఆగింది.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇక అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 10 పైసలు తగ్గుదలతో రూ.77.58 కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 15 పైసలు క్షీణతతో రూ.71.75 కు తగ్గింది.
ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 10 పైసలు తగ్గుదలతో రూ.77.21కుచేరుకోగా. డీజిల్ ధర కూడా 14 పైసలు క్షీణతతో రూ.71.41 కు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో ధరలను చూసుకుంటే అక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 10 పైసలు క్షీణతతో రూ.73.32కు తగ్గింది. డీజిల్ ధర కూడా 14 పైసలు తగ్గుదలతో రూ.66.46 కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 10 పైసలు క్షీణతతో రూ.78.93 ఉండగా. డీజిల్ ధర 15 పైసలు తగ్గుదలతో రూ.69.66కు దిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 2.39 శాతం పెరుగుదలతో 60.51 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 2.15 శాతం పెరుగుదలతో 54.70కు ఎగసింది. ఇక ఈ తగ్గుదల వల్ల వాహనదారులకు ఏవిధమైన ఉపయోగముంటుందో తెలియడం లేదు. మార్కెట్లో అన్ని ధరలు భారీగా పెరిగిన నేపధ్యంలో సామాన్యుడి బ్రతుకు ఇప్పటికే అతలాకుతలం అవుతుంది..